31, డిసెంబర్ 2019, మంగళవారం

తెలుగు చదువులకు ఉద్యోగాలేవి?



తెలుగు చదువులకు ఉద్యోగాలేవి? (సూర్యలో నా సంపాదకీయం 1.1.2020)
విజయవాడలో4 వ ప్రపంచ తెలుగు రచయితల సంఘం మహాసభల తీర్మానాలలో తెలుగు చదువులకు ఉద్యోగాలు ఇవ్వండి అని కూడా తీర్మానం చేరిస్తే బాగుండేది.కోటివిద్యలు కూటికోసమే కదా? మండలి బుద్ధప్రసాద్ గారి లాంటివాళ్లు ఇంకా తెలుగు వెనకాలేపడి పరుగుతీస్తున్నారు. బీజీపీ ఎమ్మెల్సీ మాధవ్ గారి లాంటి చాలామంది తెలుగు మాధ్యమంలో చదివినవారికీ,పోటీ పరీక్షలు రాసిన అభ్యర్ధులకు ఉద్యోగాలు ఇవ్వాలని ఈ సభల్లో కోరారు. కానీ ఉద్యోగాలు రాక ప్రజల ఆదరణ తగ్గింది.మీటింగ్ ఎదుటివారికి మాత్రమేనా? వీళ్ళ పిల్లలు అందరూ ఏ స్కూలుకు వేళ్ళాతున్నారో చెప్పాలి అని కొందరు వింతగా ప్రశ్నిస్తున్నారు.వాస్తవానికి ఒకవేళ ఎవరన్నా తమపిల్లలను తెలుగు మీడియం స్కూళ్ళకు పంపాలనుకుంటే సరైన స్కూలు కావాలి.తెలుగు బడుల్లో నీటి వసతి,మరుగుదొడ్లు ఉండవు.పిల్లల్ని ఎలా పంపిస్తారు? కార్పొరేట్ స్కూళ్ళు కాన్వెంట్లను చూసి తెలుగుబడులను చూస్తే ఏమనిపిస్తుంది?ఎలా ఉంటుంది?తెలుగుబడులు పాలకుల ప్రజల నిరాదరణకు గురైన కారణంగా ప్రైవేటు వాళ్ళు కాన్వెంట్లతో సొమ్ముచేసుకున్నారు.తెలుగులో చదివితే ఉద్యోగాలు ఇస్తున్నారా? ప్రోత్సాహకాలు ఏమున్నాయి? మనిషి ఆశబోతు.ఎటు లాభం ఉంటే అటే పోతాడు.ప్రజల పాలకుల ఆదరణ ఆచరణ ఉంటేనే ఏ పధకమైనా సఫలం అయ్యేది.అరసి పాలిచ్చి పెంచిన అమ్మయైన విషము పెట్టిన కుడుచునే ప్రియసుతుండు అన్నట్లు రేపు ప్రభుత్వ ఆంగ్లమీడియమ్ స్కూళ్ళలో కూడా ప్రాధమిక సదుపాయాలు లేకపోతే ప్రైవేటు కాన్వెంట్లదే రాజ్యం! తెలుగు లోనే.చదువు ఉండాలి ఇంగ్లీషు వద్దు అనే వాళ్లూ ఉన్నారు.చాలా తక్కువగా ఉన్నప్పటికీ అల్పసంఖ్యాకుల భాషను కాపాడటం ప్రభుత్వధర్మం. నాతల్లి అనాకారి అయినా పేదరాలైనా నాకు ఇష్టమే.నిజాన్ని నిజమనే చెబుదాం.ఇంగ్లీషు మీడియం స్కూలైనా మరుగు దొడ్డి లేకపోతే చేర్చం. న్యాయం అడగటం కూడా పోరాటమే.అహింసాయుత పోరాటాలకు ఎవరి అడ్డూలేదు. తెలుగును ఒక సబ్జెక్టుగా తప్పనిసరిగా చదవాలని ఉత్తర్వులు ఇచ్చారు అని అధికార భాషా సంఘం అధ్యక్షులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు అంటున్నారు.తెలుగు సభల్లోనేమో అందరి కోరికా.తెలుగును కాపాడుకోవాలి, అన్ని సబ్జెక్టులనూ యధాతధంగా తెలుగులో కొనసాగించాలి అని. సభల్లో ఎక్కువమంది కోరిక ఏమిటంటే తమిళమాధ్యమ విద్యార్ధులకు ఇస్తున్నట్లే తెలుగు మాధ్యమ విధ్యార్హులకూ ఉద్యోగాలు ఇప్పించి తెలుగులో పాలన జరపాలని.ఆంగ్లమాధ్యమాన్ని రద్దు చేయనక్కరలేదు.తెలుగు మాధ్యమాన్ని కూడా ఉంచండి.తెలుగులో తీర్పులు, పాలన ఉంటాయని కదా తెలుగు రాష్ట్రాన్ని తెచ్చుకుంది? తెలుగులో చదివినవారికి ఉద్యోగాలు కల్పించాలి.ఎన్టీ రామారావు గారి పాలన వరకూ సర్వీసుకమీషన్ పరీక్షల్లో తెలుగుమాధ్యమ అభ్యర్ధులకు ఇచ్చిన 5 శాతం ప్రోత్సాహక మార్కులను పునరుద్ధరించాలి.తమిళనాడులో లాగా తెలుగు మాధ్యమం లో చదివినవారికి ఉద్యోగాలిస్తూ ప్రభుత్వం అండగా నిలవాలి. తెలుగు పత్రికాధిపతులు,తెలుగు భాషాసంఘాల వాళ్ళు మౌనంగా ఉండకూడదు. తెలుగు మాధ్యమవిద్య కోసం హైకోర్టుకు వెళ్ళిన భాషాభిమానులకు న్యాయవాదులకు కృతజ్నతలు.భాషాభిమానం ఒక్కటే మనల్ని కాపాడదు. బాషద్వారా బువ్వ దొరికేలా చెయ్యాలి.తెలుగు మాధ్యమం ద్వారా కూడా ఉద్యోగాలు దొరుకుతుంటే జనం ఎవరూ చెప్పకుండానే ఎగబడతారు.తెలుగుద్వారా ఉద్యోగాలెప్పుడో అని మొదటి ప్రపంచతెలుగు సభల్నాడే శ్రీశ్రీ తన అసంతృప్తినివెళ్ళగక్కాడు.ఇంగ్లీషు లిపినే తెలుగుకు వాడుకుందామన్నాడు.ఆయనమాట ఎవరూ వినలేదు.తెలుగు పాఠ్యపుస్తకాలలో తేలికైన తెలుగుపదాలకు బదులు కఠిన సంస్కృతపదాలు కుమ్మరించి,ఆంగ్లపదాలను కూడా అడ్డుకొని పిల్లలు తెలుగు చదువంటే పారిపోయేలా చేశారు.వేలాది ఇంగ్లీషు పదాలను జనమే సొంతంచేసుకున్నారు.ఇప్పుడు ఇంగ్లీషే సులభం అని కొందరు న్యాయమూర్తులు కూడా అంటున్నారు. ప్రజల నాడి కనిపెట్టిన పాలకులు తధాస్తు అంటున్నారు.ఇక ప్రజల భాష తెలుగు పాలనాభాష అవుతుందా?అలాంటి ఆశలు మనము ఉన్నాయా?అడగకపోతే అమ్మాయినా పెట్టదు అని సామెత.అవసరసమయంలో అన్నార్తి అడగకపోతే ఎలా?
తెలుగు అధికారభాష కావాలంటే,తెలుగు దేవభాషే ,తెలుగులో పాలన అనే నా మూడు పుస్తకాలలో నేను కోరింది ప్రజల భాష పాలనా భాష గా మారాలనే. రాజ్యాంగం 345 ఆర్టికిల్ ప్రకారం ఎవరి భాషను వాళ్ళు కాపాడుకోవాలి, అధికారభాషగా అభివృద్ధి చేసుకోవాలని,చెన్నై మదురై,బెంగుళూరు హైకోర్టులు చెప్పాయి. ఆ రాష్ట్రాలలో తమిళ, కన్నడ భాషలు పాలనాభాషలుగా ఉండాలని కోరాయి. తమిళనాడులో తమిళ అభ్యర్దులకు 20 శాతం ఉద్యోగాలు ఇవ్వాలని జీవో ఇచ్చారు. ఆప్పట్లో తెలుగు మీడియం అభ్యర్ధులకు 10 శాతం ఉద్యోగాలు కోటా ఇస్తామని మన మంత్రులు కూడా ప్రకటించారు.తెలుగు మాధ్యమంలో చదివిన అభ్యర్డులకు ఉద్యోగాలలో 20% రిజర్వేషన్ ఇవ్వాలని విజయవాడ తెలుగు మహాసభల్లో ఒక తీర్మానం చేసినట్లయితే బాగుండేది. కనీసం గ్రామ సచివాలయాల్లో ఉద్యోగ నియామకాలకు కూడా తెలుగు మాధ్యమం లో చదివిన అభ్యర్డులకు ప్రోత్సాహకాలు ప్రకటిస్తే బాగుండేది. ఎందుకంటే గ్రామ వాలంటీర్లు, గ్రామ సచివాలయ ఉద్యోగులందరూ గ్రామ ప్రజలతో మమేకమై వారితో ముఖాముఖి తెలుగులో మాట్లాడుతూ వారిమధ్యే నివసిస్తూ వారికి సేవలందించే ఉద్యోగులు. ప్రజలు వారి భాషలో చెప్పే సమస్యలు, పరిష్కారాలు,సూచనలు వినాలి,రాయగలగాలి . ఈ నైపుణ్యాలన్నీ ప్రజల భాష తెలుగు మాధ్యమంలో చదివిన వారికే ఎక్కువగా ఉంటాయి. ఆఫీసుల్లో తెలుగు బ్రతుకుతుంది. తెలుగు విూడియంలో చదివితే ఉద్యోగాలొస్తాయన్న ఆశతో కొంత మందైనా తెలుగులో చదువుతారు. అధికారులు కార్యాలయాల్లో జరిగే పనులన్నిటిద్వారా తెలుగును అమలుచేస్తారు. తెలుగు పదకోశాలు అమలవుతాయి. పరిపాలనకు పనికొచ్చే శాస్త్రీయ పాలనా తెలుగు తయారవుతుంది.అధికారభాషగా తెలుగు అమలు కావాలంటే తెలుగు మాధ్యమంలో చదివిన విద్యార్థుల్ని ప్రోత్సహించి అధికారులుగా చేయకతప్పదు.ఉద్యోగాలు దొరకక పొతే మన ప్రజలు పిల్లల్ని తెలుగులో చదివించరు.తెలుగు భాషలో మాత్రమే చదివిన వారికి వెనుక బడిన కులాలవారికి ఇస్తున్నట్లుగా ఉద్యోగాలలో కూడా రిజర్వేషన్లు ఇవ్వాలి.తెలుగురాష్ట్రాలలో తెలుగు భాష రక్షణ,తెలుగులో పాలన కోసం తెలుగు మాధ్యమం లో చదివినవారికి ప్రోత్సాహకాలు,ఉద్యోగాలు కల్పిస్తూ ప్రభుత్వాలు అండగా నిలవాలి.
నూర్ బాషా రహంతుల్లా ,
విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్ 6301493266

28, డిసెంబర్ 2019, శనివారం

తెలుగు చదువులకు ఉద్యోగాలు ఇవ్వండి!


తెలుగు చదువులకు ఉద్యోగాలు ఇవ్వండి!


4 వ ప్రపంచ తెలుగు రచయితల సంఘం మహాసభలు విజయవాడలో జరిగాయి. 11 తీర్మానాలు చేశారు. కానీ తెలుగు చదువులకు ఉద్యోగాలు ఇవ్వండి అని కూడా తీర్మానం చేరిస్తే బాగుండేది.కోటివిద్యలు కూటికోసమే కదా? సంస్కృతి సాహిత్యాల పురోగతి గురించిన చింతన బాగానే జరిగింది. కవిత్వమూ పుస్తకావిష్కరణాలూ తెలుగు భాషను మాధ్యమంగా ఉంచాలన్న ప్రసంగాలూ మారుమోగిపోయాయి. పాపం మండలి బుద్ధప్రసాద్ గారి లాంటివాళ్లు ఇంకా తెలుగు వెనకాలేపడి పరుగుతీస్తున్నారు. బీజీపీ ఎమ్మెల్సీ మాధవ్ గారి లాంటి చాలామంది తెలుగు మాధ్యమంలో చదివినవారికీ,పోటీ పరీక్షలు రాసిన అభ్యర్ధులకు ఉద్యోగాలు ఇవ్వాలని ఈ సభల్లో కోరారు. కానీ ఉద్యోగాలు రాక ప్రజల ఆదరణ తగ్గింది.మీటింగ్ ఎదుటివారికి మాత్రమేనా? వీళ్ళ పిల్లలు అందరూ ఏ స్కూలుకు వేళ్ళాతున్నారో చెప్పాలి అని కొందరు వింతగా ప్రశ్నిస్తున్నారు.వాస్తవానికి ఒకవేళ ఎవరన్నా తమపిల్లలను తెలుగు మీడియం స్కూళ్ళకు పంపాలనుకుంటే సరైన స్కూలు కావాలి.తెలుగు బడుల్లో నీటి వసతి,మరుగుదొడ్లు ఉండవు.పిల్లల్ని ఎలా పంపిస్తారు? కార్పొరేట్ స్కూళ్ళు కాన్వెంట్లను చూసి తెలుగుబడులను చూస్తే ఏమనిపిస్తుంది?ఎలా ఉంటుంది?తెలుగుబడులు పాలకుల ప్రజల నిరాదరణకు గురైన కారణంగా ప్రైవేటు వాళ్ళు కాన్వెంట్లతో సొమ్ముచేసుకున్నారు.తెలుగులో చదివితే ఉద్యోగాలు ఇస్తున్నారా? ప్రోత్సాహకాలు ఏమున్నాయి? మనిషి ఆశబోతు.ఎటు లాభం ఉంటే అటే పోతాడు.ప్రజల పాలకుల ఆదరణ ఆచరణ ఉంటేనే ఏ పధకమైనా సఫలం అయ్యేది.అరసి పాలిచ్చి పెంచిన అమ్మయైన విషము పెట్టిన కుడుచునే ప్రియసుతుండు అన్నట్లు రేపు ప్రభుత్వ ఆంగ్లమీడియమ్ స్కూళ్ళలో కూడా ప్రాధమిక సదుపాయాలు లేకపోతే ప్రైవేటు కాన్వెంట్లదే రాజ్యం! తెలుగు లోనే.చదువు ఉండాలి ఇంగ్లీషు వద్దు అనే వాళ్లూ ఉన్నారు.చాలా తక్కువగా ఉన్నప్పటికీ అల్పసంఖ్యాకుల భాషను కాపాడటం ప్రభుత్వధర్మం. నాతల్లి అనాకారి అయినా పేదరాలైనా నాకు ఇష్టమే.నిజాన్ని నిజమనే చెబుదాం.ఇంగ్లీషు మీడియం స్కూలైనా మరుగు దొడ్డి లేకపోతే చేర్చం. న్యాయం అడగటం కూడా పోరాటమే.అహింసాయుత పోరాటాలకు ఎవరి అడ్డూలేదు. తెలుగును ఒక సబ్జెక్టుగా తప్పనిసరిగా చదవాలని ఉత్తర్వులు ఇచ్చారు అని అధికార భాషా సంఘం అధ్యక్షులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు అంటున్నారు.తెలుగు సభల్లోనేమో అందరి కోరికా.తెలుగును కాపాడుకోవాలి, అన్ని సబ్జెక్టులనూ యధాతధంగా తెలుగులో కొనసాగించాలి అని. సభల్లో ఎక్కువమంది కోరిక ఏమిటంటే తమిళమాధ్యమ విద్యార్ధులకు ఇస్తున్నట్లే తెలుగు మాధ్యమ విధ్యార్హులకూ ఉద్యోగాలు ఇప్పించి తెలుగులో పాలన జరపాలని.ఆంగ్లమాధ్యమాన్ని రద్దు చేయనక్కరలేదు.తెలుగు మాధ్యమాన్ని కూడా ఉంచండి.తెలుగులో తీర్పులు, పాలన ఉంటాయని కదా తెలుగు రాష్ట్రాన్ని తెచ్చుకుంది? తెలుగులో చదివినవారికి ఉద్యోగాలు కల్పించాలి.ఎన్టీ రామారావు గారి పాలన వరకూ సర్వీసుకమీషన్ పరీక్షల్లో తెలుగుమాధ్యమ అభ్యర్ధులకు ఇచ్చిన 5 శాతం ప్రోత్సాహక మార్కులను పునరుద్ధరించాలి.తమిళనాడులో లాగా తెలుగు మాధ్యమం లో చదివినవారికి ఉద్యోగాలిస్తూ ప్రభుత్వం అండగా నిలవాలి. తెలుగు పత్రికాధిపతులు,తెలుగు భాషాసంఘాల వాళ్ళు మౌనంగా ఉండకూడదు. తెలుగు మాధ్యమవిద్య కోసం హైకోర్టుకు వెళ్ళిన భాషాభిమానులకు న్యాయవాదులకు కృతజ్నతలు.భాషాభిమానం ఒక్కటే మనల్ని కాపాడదు. బాషద్వారా బువ్వ దొరికేలా చెయ్యాలి.తెలుగు మాధ్యమం ద్వారా కూడా ఉద్యోగాలు దొరుకుతుంటే జనం ఎవరూ చెప్పకుండానే ఎగబడతారు.తెలుగుద్వారా ఉద్యోగాలెప్పుడో అని మొదటి ప్రపంచతెలుగు సభల్నాడే శ్రీశ్రీ తన అసంతృప్తినివెళ్ళగక్కాడు.ఇంగ్లీషు లిపినే తెలుగుకు వాడుకుందామన్నాడు.ఆయనమాట ఎవరూ వినలేదు.తెలుగు పాఠ్యపుస్తకాలలో తేలికైన తెలుగుపదాలకు బదులు కఠిన సంస్కృతపదాలు కుమ్మరించి,ఆంగ్లపదాలను కూడా అడ్డుకొని పిల్లలు తెలుగు చదువంటే పారిపోయేలా చేశారు.వేలాది ఇంగ్లీషు పదాలను జనమే సొంతంచేసుకున్నారు.ఇప్పుడు ఇంగ్లీషే సులభం అని కొందరు న్యాయమూర్తులు కూడా అంటున్నారు. ప్రజల నాడి కనిపెట్టిన పాలకులు తధాస్తు అంటున్నారు.ఇక ప్రజల భాష తెలుగు పాలనాభాష అవుతుందా?అలాంటి ఆశలు మనము ఉన్నాయా?అడగకపోతే అమ్మాయినా పెట్టదు అని సామెత.అవసరసమయంలో అన్నార్తి అడగకపోతే ఎలా?   
తెలుగు అధికారభాష కావాలంటే,తెలుగు దేవభాషే ,తెలుగులో పాలన అనే నా మూడు పుస్తకాలలో నేను కోరింది ప్రజల భాష పాలనా భాష గా మారాలనే. రాజ్యాంగం 345 ఆర్టికిల్ ప్రకారం ఎవరి భాషను వాళ్ళు కాపాడుకోవాలి, అధికారభాషగా అభివృద్ధి చేసుకోవాలని,చెన్నై మదురై,బెంగుళూరు హైకోర్టులు చెప్పాయి. ఆ రాష్ట్రాలలో తమిళ, కన్నడ భాషలు పాలనాభాషలుగా ఉండాలని కోరాయి. తమిళనాడులో తమిళ అభ్యర్దులకు 20 శాతం ఉద్యోగాలు ఇవ్వాలని జీవో ఇచ్చారు. ఆప్పట్లో తెలుగు మీడియం అభ్యర్ధులకు 10 శాతం ఉద్యోగాలు కోటా ఇస్తామని మన మంత్రులు కూడా ప్రకటించారు.తెలుగు మాధ్యమంలో చదివిన అభ్యర్డులకు ఉద్యోగాలలో 20% రిజర్వేషన్ ఇవ్వాలని విజయవాడ తెలుగు మహాసభల్లో ఒక తీర్మానం చేసినట్లయితే బాగుండేది. కనీసం గ్రామ సచివాలయాల్లో ఉద్యోగ నియామకాలకు కూడా తెలుగు మాధ్యమం లో చదివిన అభ్యర్డులకు ప్రోత్సాహకాలు ప్రకటిస్తే బాగుండేది. ఎందుకంటే గ్రామ వాలంటీర్లు, గ్రామ సచివాలయ ఉద్యోగులందరూ గ్రామ ప్రజలతో మమేకమై వారితో ముఖాముఖి తెలుగులో మాట్లాడుతూ వారిమధ్యే నివసిస్తూ వారికి సేవలందించే ఉద్యోగులు. ప్రజలు వారి భాషలో చెప్పే సమస్యలు, పరిష్కారాలు,సూచనలు వినాలి,రాయగలగాలి . ఈ నైపుణ్యాలన్నీ ప్రజల భాష తెలుగు మాధ్యమంలో చదివిన వారికే ఎక్కువగా ఉంటాయి. ఆఫీసుల్లో తెలుగు బ్రతుకుతుంది. తెలుగు విూడియంలో చదివితే ఉద్యోగాలొస్తాయన్న ఆశతో కొంత మందైనా తెలుగులో చదువుతారు. అధికారులు కార్యాలయాల్లో జరిగే పనులన్నిటిద్వారా తెలుగును అమలుచేస్తారు. తెలుగు పదకోశాలు అమలవుతాయి. పరిపాలనకు పనికొచ్చే శాస్త్రీయ పాలనా తెలుగు తయారవుతుంది.అధికారభాషగా తెలుగు అమలు కావాలంటే తెలుగు మాధ్యమంలో చదివిన విద్యార్థుల్ని ప్రోత్సహించి అధికారులుగా చేయకతప్పదు. ఇంకొందరు పాలనా నిపుణులు లేవనెత్తిన డిమాండ్లు ఏమిటంటే : తెలుగు అనువాదాలు బాగుపడాలి, ఆంగ్ల కీబోర్డు ద్వారా తెలుగు లిపి పొందే దానిలో వస్తున్న సమశ్యలను ఇంకా తొలగించాలి అని. ఉద్యోగాలు దొరకక పొతే మన ప్రజలు పిల్లల్ని తెలుగులో చదివించరు.తెలుగు భాషలో మాత్రమే చదివిన వారికి వెనుక బడిన కులాలవారికి ఇస్తున్నట్లుగా ఉద్యోగాలలో కూడా రిజర్వేషన్లు ఇవ్వాలి.తెలుగురాష్ట్రాలలో తెలుగు భాష రక్షణ,తెలుగులో పాలన కోసం తెలుగు మాధ్యమం లో చదివినవారికి ప్రోత్సాహకాలు,ఉద్యోగాలు కల్పిస్తూ ప్రభుత్వాలు అండగా నిలవాలి.
నూర్ బాషా రహంతుల్లా ,
విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్ 6301493266

14, నవంబర్ 2019, గురువారం

భాషా రాజకీయం - తెలుగు చదివితే ఉద్యోగమేది ?

భాషా రాజకీయం - తెలుగు చదివితే ఉద్యోగమేది ? (సూర్య 17.11.2019)


తెలుగు ద్వారా ఉద్యోగమివ్వటం తెలుగు ప్రభుత్వాల వల్లకాదు.ఉద్యోగం కావాలంటే ఇంగ్లీషు అవసరమే అనుకోని ఇన్నాళ్లూ ధనవంతులు తమ పిల్లల్ని కాన్వెంట్లలో చదివించారు.ఇంగ్లీషు కాన్వెంట్లకు ట్యుటోరియల్ కాలేజీలకు వ్యతిరేకంగా పోరాటాలెమీ తెలుగునాట జరుగలేదు.ఉద్యోగము ఇవ్వలేని చదువు వ్యర్ధమే.ఇంగ్లీషు మాధ్యమం కోరుతున్నవారి వాదన అదే.ఇన్నేళ్ల పాలనలో తెలుగుకు ఉద్యోగాలు ఇచ్చే శక్తి స్థాయి ఏ ప్రభుత్వమూ తేలేకపోయింది. తెలుగు పద్యాలకు కవిత్వాలకు పరిమితమై పోయింది. బడిపిల్లలకు తెలుగు వ్రాయడం, చదవడం వీలుకాని పరిస్థితి.తెలుగులో పాలన అంటే ఒక కోరరాని కోరిక,అత్యాశలాగా మాట్లాడుతున్నారు.
‘నేను తెలుగు మాట్లాడను’ అని వందసార్లు పిల్లల చేత వ్రాయించిన వాళ్ళను దేశభక్తులుగా పొగుడుతున్నారు.మేము ఆంగ్ల మాధ్యమానికి వ్యతిరేకంకాదు,తెలుగుమాధ్యమంపై నిషేధం తప్పంటున్నాం.కావాలంటే హిందీని,సంస్కృతాన్ని తీసెయ్యండి.తెలుగులో ఒత్తులు,గుణింతాలు తీసేసి తమిళంలాగా బాగుచెయ్యండి.పనికిమాలిన ఛందస్సును వ్యాకరణాన్నీ ఎత్తేసి ప్రజలలో పాలనలో వాడుకభాషను అమలుచెయ్యండి అని ఇన్నాళ్లూ అడిగారు కానీ ఎవరూ మనసు పెట్టలేదు.మీ పుత్రులను మనమళ్లను ఇంగ్లీషు మీడియంలో ఎందుకు చేర్చారని వెంకయ్యానాయుడును,చంద్రబాబును, పవన్ కల్యాణ్ , రామోజీరావును జగన్ విమర్శించారు.తెలుగులో చదివితే ప్రపంచ స్థాయిఉద్యోగాలు రావని అందరికీ తెలుసు. ఆస్థాయికి తెలుగును తీసికెళ్లటం ఏ పాలకునివల్లా కాలేదు.ఇకమీదట అవ్వదు కూడా.కష్టపడి తయారు చేసుకోవటం కంటే అప్పటికే అమర్చిపెట్టినదాన్ని మేయటం సులభంకదా?

చావు,పెండ్లి మంత్రాలు తెలుగులో యెందుకు చదువరు అని కొందరు అడిగారు. ఏ మాతృభాషైనా సరే దాన్ని మాట్లాడేవాళ్ళ మారే అవసరాలకి ఆదుకోకపోతే మృతమవుతుంది.తెలుగు వ్యాకరణం పనికిరాని సంధులు, సమాసాలతో పాటు ఉంటుంది.ఉద్యోగాలకు పనికిరాని తెలుగు నేర్చుకుంటే ఉపయోగం ఏమిటి ?ఇప్పటికే 50% ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ఉన్నది.దాన్ని 100% చేస్తే తప్పేమీ కాదు.కాని తెలుగు మీడియం పూర్తిగా తీసివేయడం న్యాయమా? విద్యార్ధులు తమ తల్లిదండ్రుల లేదా తమ కోరిక మేరకు నచ్చిన మీడియంలో చేరి చదువుకుంటున్నారు. ఇంగ్లీష్ ప్రపంచానికి ద్వారమే .ఎవరు కాదన్నారు?ప్రస్తుతం అందరూ ఆంగ్ల మాధ్యమం లోనే చదువుకోవాలంటూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. అయితే తెలుగు మీడియం కూడా ఉండాలన్నవారు అభివృద్ధి నిరోధకులా? పేదవారికి వ్యతిరేకమా?మాధ్యమాన్ని ఎంచుకొనే స్వేఛ్చ విద్యార్ధికి ఉండాలా వద్దా?ఇప్పటికే ఉన్న మాధ్యమాన్ని కొనసాగించవచ్చుకదా?

ఇంగ్లీష్ విద్య తోనే వుయ్యూరు అమ్మాయి యలమంచిలి అర్చనారావు న్యూయార్కు న్యాయమూర్తి పదవిని సాధించిందన్నారు. ప్రైవేటు స్కూళ్లల్లో చదివిన, చదువుతున్న పిల్లలున్న సంపన్నుల కాలనీల్లోని ఇళ్లలో తెలుగు ఎందుకు చనిపోలేదు? పేద పిల్లలు కూడా తమలాగే ఇంగ్లిష్‌ నేర్చుకోవాలని వైఎస్‌ జగన్‌ కోరుకుంటున్నారు. ఆయన విధానంలో తప్పేముంది? ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగిష్‌ను ప్రధాన బోధనా భాషగా చేస్తామని చెప్పినందునే ప్రజలు ఆయనకు ఓట్లువేసి గెలిపించారు.మన జాతి నిర్మాతలు ఆ ఇంగ్లీషుభాషను ఎందుకు కొనసాగించారు? పైగా దేశాన్ని, రాష్ట్రాలను పా లిస్తున్న కులీనవర్గాలలో ఇంగ్లిష్‌ ఎందుకు మనగలిగి ఉంటోంది? 1947లో ఇంగ్లిష్‌ను జాతీయ భాష గా గుర్తించాలని, ప్రభుత్వపాఠశాలల్లో ఇంగ్లిష్‌ను తప్పకుండా బోధించాలని అంబేడ్కర్‌ పట్టుపట్టారనీ , ప్రైవేట్‌ స్కూళ్ళు కాలేజీలు ఇంగ్లిష్‌ బోధన చేశాయనీ,ఆబోధతో పైకులాలవాళ్లు బాగుపడ్డారనీ,కింది కులాలకు ఆంగ్లం అలవడితే మంచిదనీ,దానికి అడ్డుపడకూడదని కంచ ఐలయ్య లాంటి వారు వాదిస్తున్నారు. అవన్నీ నిజమే.ఇంగ్లీషు మీడియం ను ఎవరూ వద్దనటంలేదు.అడ్డుపడటం లేదు. మన పాలకులు పాడుపడ్డ తెలుగును బాగుచేయ్యకుండా ముందుకు పోతున్నారు.తెలుగు అసలు అనవసరం వదిలేద్దాం అంటున్నారు. ఆంగ్లాన్ని కాపాడుకుంటూనే మరో ప్రక్క తమిళనాడు ప్రభుత్వం తమిళంలో ఉద్యోగాలు సృష్టించింది. పెరియార్ కాలంనుండి తమిళ లిపిని సామాన్యులకోసం అనేకసార్లు మార్చుకుంది.తమిళంలో చదివితే భవిష్యత్తు ఉంటుందన్న నమ్మకాన్ని కలిగించింది.తమిళ మాధ్యమంలో చదివిన అభ్యర్డులకు ఉద్యోగాలలో 20 శాతం రిజర్వేషన్ ఇవ్వటం రాజ్యాంగబద్దమేనని ఏ రాష్ట్ర భాషను ఆ రాష్ట్రం కాపాడుకోవాలని మద్రాసు హైకోర్టు తీర్పు ఇచ్చింది.రాష్ట్రస్థాయిలో అత్యధిక మార్కులు సాధించినా తమిళం పాఠ్యాంశంగా ఉంటే మాత్రమే టాప్‌ ర్యాంకర్‌గా పరిగణిస్తారు.తమిళ భాషాభివృద్ధి కోసం ప్రత్యేక శాఖ ఉంది. తమిళమాధ్యమంలో పోటీ పరీక్షలు రాసిన న్యాయ,ఇంజినీరింగ్‌ విద్యార్థులను న్యాయమూర్తి పొగిడారు.వారూ తమిళం చదవాల్సిందే.కేంద్రమేమో హిందీ పక్షపాతి. తమిళనాడులో మాతృభాషకి ఇస్తున్న ప్రాముఖ్యం ఆంధ్రా,తెలంగాణాల్లో కూడా తెలుగుకు ఇ వ్వాలి.మాకు ఉపాధి దొరికే భాష కావాలని ప్రజలే ప్రభుత్వాలను అడుగుతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో 10 శాతం మంది మాత్రమే ఇంగ్లీషు మీడియంలో బోధన చేయగలరు. మిగిలిన 90 శాతం మంది తెలుగు మీడియమే! ఆకస్మికంగా ఇంగ్లీషు మీడియం లోకి మారిన పిల్లల విద్యాప్రమాణాలు పడిపోయి,అర్ధంతరంగా చదువు మానేసి, న్యూనతకు గురైతే అందుకు బాధ్యత ఎవరిది? 5వ తరగతి వరకు ప్రతిఒక్కరూ మాతృభాషలోనే చదువుకోవటం వలన మాతృభాష రక్షించబడుతుంది.6 వ తరగతి నుంచి ఇంగ్లీషు మీడియం ప్రవేశపెడితే మంచిది.మాతృభాషలో బోధనకు పూర్తిగా మంగళం పలకడం దేశంలో ప్రపంచంలో మరెక్కడా లేదు. ఫ్రాన్స్‌, చైనా, జర్మనీ, జపాన్‌ దేశాల్లో బోధన మాతృభాషలోనే జరుగుతుంది.అవన్నీ మనకంటే అభివృద్ధి చెందిన దేశాలే. తెలుగు అంకెలు ఇప్పుడు ఎవరూ వాడటం లేదు. ఇంగ్లీషు వాళ్ళు కూడా రోమన్ అంకెలు మానేసి అరబిక్ అంకెలు వాడుతున్నారు. శ్రీ శ్రీ గారు తెలుగు లిపి లో ఉన్న ఆటంకాలు గ్రహించి ఆంగ్ల లిపిలోకి మారటం మంచిది అన్నారు.తెలుగులో ఉన్న సవాలక్ష సమస్యలు సరిదిద్దుకోవాలి. అక్షరాలు మన పిల్లలకు ఎంతో సులువుగా ఉండాలని వాదిస్తూ వేటూరి ప్రభాకర శాస్త్రి గారు చాలా కష్ట పడ్డారు. ప్రభుత్వ పాలకులు తెలుగు మహాసభలు జరిపారు కానీ లిపి సమస్యను పట్టించుకోలేదు.శ్రీ శ్రీ కూడా భవిష్యత్తు ఆలోచించి ఆంగ్ల లిపిని తెలుగుకు వాడుకొమ్మన్నారు.మన జనం కోసం మనం వారి బాట పట్టాలి.ఈ భాషను ఈస్థాయికి తెచ్చిన మన పితరులున్నారు.ఆ ప్రజల అందరి వాడకం వలన మనకు పదాలు స్ధిరపడతాయి.వాటిని అలా వాడితేనే మంచిది.తెలుగు నిఘంటువులోకి ప్రజల నోళ్ళలో నానుతున్న వేలాది ఇంగ్లీషు పదాలను తీసుకొని అనువాదాలలో వాడాలి. ఇప్పటి వరకు ప్లస్‌, ఈజీక్వల్టు, మైనస్‌, ఇంటు లాంటి ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధక పదాలను కల్పించి లెక్కలు చెప్పలేదు. తెలుగు విూడియం వాళ్ళు కూడా ప్లస్‌, మైనస్‌ అనే శబ్ధాల్నే వాడుతున్నారు. గత్యంతరం లేదు,అనుకున్న ఆంగ్లపదాలను మాత్రం తెలుగు నిఘంటువులో చేర్చటం అవశ్యం, అత్యవసరం. వాడుక పదాల సంపద భాషకు జీవమిస్తుంది. అవి పరభాషపదాలు కూడా కావచ్చు.తెలుగును వాడుక భాషలోకి ప్రజలకుపనికొచ్చేలా మార్చాలి.తెలుగు భాష రక్షణ,తెలుగులో పాలన కోసం తెలుగు మాధ్యమం లో చదివినవారికి ఉద్యోగాలు కల్పిస్తూ ప్రభుత్వం అండగా నిలవాలి.ప్రోత్సాహకాలు,రిజర్వేషన్లు ఇచ్చిమరీ తెలుగు భాషను రక్షించుకోవాలి. రాష్ట్రప్రభుత్వం ఉద్యోగాలకల్పన తెలుగు వారికోసం కూడా జరపా లి. తెలుగును కాపాడుకుంటూనే తమిళనాడు లాగా ఇంగ్లీషు మాధ్యమాన్నీ కొనసాగించవచ్చుకదా? తెలుగు పత్రికాధిపతులు,భాషాసంఘాలు తెలుగు మాధ్యమం కావాలంటూ హైకోర్టుకు వెళ్ళవచ్చుకదా?మాతృభాషలో ప్రాధమిక విద్య నేర్పటం కనీసధర్మం,రాజ్యాంగబద్దం.మన రాష్ట్రంలో కూడా తెలుగులో విద్యను కాపాడుకోటానికి తెలుగువిద్య ద్వారా ఉపాధి కల్పనకు హైకోర్టు మార్గదర్శకత్వాన్ని కోరటం మంచిది.
--నూర్ బాషా రహంతుల్లా ,విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్,6301493266

8, నవంబర్ 2019, శుక్రవారం

తెలుగు ఎవరికి కావాలి? ఎందుకు కావాలి?

                                      తెలుగు ఎవరికి కావాలి? ఎందుకు కావాలి?
ఇకమీదట ఆంగ్లమాధ్యమం లోనే చదువులన్నీ ఉండబోతున్నాయని జీవో వచ్చింది.చదువంతా ఇంగ్లీషుమయమైతే ఇక అధికార భాషా సంఘం ఎందుకు,తెలుగు అకాడమీ ఎందుకు,వాటికి పని ఏముంటుంది,వాటి చైర్మన్లు ఏమి చెయ్యను? మొదలైన ప్రశ్నలు భాషా సంఘాలవాళ్ళు సంధిస్తే ,ఇంగ్లీషు మీడియాన్ని ప్రజలు కోరుకున్నారు కాబట్టే ప్రభుత్వంకూడా సరే అందని మంత్రులు కూడా సమర్ధించుకున్నారు.
తెలుగు గురించి గొప్పగా రాసేవారిలో ఎంత మంది తమ పిల్లలను తెలుగుమీడియంలో చదివిస్తున్నారు ? ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ పెడితే ఎందుకు ఏడుస్తున్నారూ? ఇంగ్లీష్ మీడియంలో చదివితే ఉద్యోగం దోరుకుతుంది . తెలుగు బాష వల్ల ప్రయోజనం ఏమిటి?ఉద్యోగం వస్తుందా? తెలుగును ఇన్నాళ్ళూ హత్తుకున్న ఎస్సీ ఎస్టీ, బీసీ. మైనార్టీలకు ఏమి ఒరిగింది? అంబేద్కర్ ఇంగ్లీషు చదువు ద్వారానే దేశానికి రాజ్యాంగం రాయగలిగాడు.పాలకులుకూడా అతన్నే శరణ్యం అనుకున్నారు.గవర్నమెంట్ స్కూల్స్ టీచర్లు కూడా తమ పిల్లలను ఇంగ్లీష్ మీడియంలో చేర్చేది ఉద్యోగాలను ఆశించే. తెలుగు భాష మాత్రమే వస్తే తెలుగు రాష్ట్రంలో కూడా ఉద్యోగాలు రావు. కాబట్టి ఈ దేశంలో గానీ విదేశాలలో గానీ ఉద్యోగాలు రావాలంటే మన పిల్లలకు ఇంగ్లీష్ మాత్రమే వస్తే చాలు. మాతృభాష కాబట్టి తెలుగు ఎలాగూ మాట్లాడను వస్తుంది.రాష్ట్రం దాటితే తెలుగుకు దిక్కులేదు.ఇంగ్లీష్ హిందీ వస్తే ప్రపంచంత తిరుగొచ్చు. రాజకీయ నాయకుల పిల్లల్ని మాత్రం ఇంగ్లిష్ మీడియంలోనే చదివిస్తారు. పేద పిల్లలు మాత్రం తెలుగులోనే చదవాలి. వాళ్లు ఉన్నత స్థాయికి ఎదగ కూడదు. విదేశాల్లో ఉన్నత చదువులకు వెళ్ల కూడదని కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారు.ఎమ్మేల్యేలు,మంత్రులు తమ కొడుకులను కూతుళ్ళను తెలుగుమీడియంలో చదివిస్తామని చెప్పమనండి చూద్దాం?ఎవరూ చెప్పరు.
తెలుగు పాఠశాలలు ఎలా ఏడుస్తున్నాయో తెలియదా? అసలు అవి ఉంటేగా చేర్చటానికి?అది ఆంగ్లమాధ్యమం మీద ఏడుపుకాదు.తెలుగు భాష ఉనికిలో లేకుండా పోతుందే అని బాధ.తెలుగోళ్ళు వద్దంటున్నది ఇంగ్లీషు ని కాదు, ఇంగ్లీష్ మీడియంని.ఉద్యోగాలు కేవలం భాషనుబట్టి రావువృత్తి లో ప్రావీణ్యత నుబట్టి వస్తాయి . ఇంగ్లీషు పెట్టినా ప్రభుత్వ పాఠశాలలో మరుగుదొడ్లు నీటిసరఫరా లాంటి ప్రాధమిక సదుపాయాలకల్పన జరగకపోతే మళ్ళీ ఆందోళన మామూలే. తెలుగు పత్రికాధిపతులు తెలుగు మాధ్యమం కావాలంటూ హైకోర్టుకు వెళ్ళవచ్చుకదా?మాతృభాషలో ప్రాధమిక విద్య నేర్పటం కనీసధర్మం,రాజ్యాంగబద్దం. తమిళ మాధ్యమంలో చదివిన అభ్యర్డులకు ఉద్యోగాలలో 20 శాతం రిజర్వేషన్ ఇవ్వటం రాజ్యాంగబద్దమేనని ఏ రాష్ట్ర భాషను ఆ రాష్ట్రం కాపాడుకోవాలని మద్రాసు హైకోర్టు తీర్పు ఇచ్చింది.మన రాష్ట్రంలో కూడా తెలుగులో విద్యను కాపాడుకోటానికి తెలుగువిద్య ద్వారా ఉపాధి కల్పనకు హైకోర్టు ఉద్దేశాన్ని కోరటం మంచిదికాదా? హోం మంత్రి షా ఒకే దేశం, ఒకే భాష అని ఒక శుష్క నినాదం దేశానికి వినిపించాడు. అప్పుడు హిందీని కూడా మన తెలుగు జనం వ్యతిరేకించారు. ఆంగ్లమీడియం అనగానే ఇంగ్లీషుకు మాత్రం నీరాజనాలు పడుతున్నారు. కారణం ఉపాధే . భారతీయ భాషలన్నీ ఆ భాషలద్వారా ఉద్యోగ కల్పనకు ఊపిరి పోయలేదు. సంస్కృత మంత్రాలు నేర్చుకున్న అర్చకునికి పూజారి ఉద్యోగమైనా దొరకవచ్చు గానీ తెలుగు మాధ్యమం లో డిగ్రీ చేసిన వానికి ఏదైనా గ్రామ సచివాలయంలో ఉద్యోగమైనా దొరుకుతుందా?తెలుగు విద్యార్ధులకు మేలు చేసే ఉద్దేశంతో 1985 వరకు సర్వీస్ కమీషన్ పోటీ పరీక్షలలో 5 శాతం ప్రోత్సాహక మార్కులు ఇచ్చారు.దానిని పునరుద్ధరించటానికి ఎవరూ ప్రయత్నించలేదు.
ఫిబ్రవరి 21ని అంతర్జాతీయ మాతృభాషా పరిరక్షణ దినోత్స వంగా తలుచుకోవటం తప్ప తెలుగు పరిరక్షణకోసం మన రాష్ట్రంలో మన ప్రభుత్వం ద్వారా ఫలానా పనులు జరుగుతాయి ఫలానా ఉద్యోగాలు దొరుకుతాయి అనే వాగ్దానం దొరికితే తప్ప ఆంధ్రప్రదేశ్ ఆంగ్లప్రదేశ్ గా మారిపోవటం ఖాయం. కట్టు బొట్టు మాత్రమే కాదు తెలుగు భాష అంటే,తెలుగు పిల్లలకు తెలుగులో చదువు నేర్పటం ఉపాధి కల్పించటం. మధురై హైకోర్టు న్యాయమూర్తి న్యాయ పరీక్షలను తమిళ మాధ్యమం లో రాసిన విద్యార్ధిని అభినందించారట. తమిళ మాధ్యమంలో చదివిన అభ్యర్దులకు 20% ఉద్యోగాలు రిజర్వు చేయడంలో ఎలాంటి తప్పూ లేదని తేల్చేసింది.రాజ్యాంగంలోని 345 ఆర్టికిల్ ప్రకారం ఎవరి భాషను వాళ్ళు కాపాడుకోవాలని,ఆయా రాష్ట్రాలలో పాలనాభాషగా అధికారభాషగా అభివృద్ధి చేసుకోవాలని కూడా తెలియ జేసింది.కోటివిద్యలు కూటికొరకే
ప్రాధమిక విద్య తెలుగుమాధ్యమంలో లేకపోతే తెలుగును పాలనా భాషగాఅమలు చెయ్యలేము.ప్రాధమిక విద్య తెలుగుమాధ్యమంలోకి మారాలి.తెలుగు ప్రాధికార సంస్థ ఏర్పడాలి.తెలుగులో పాలన జరగాలి.తెలుగు మాధ్యమంలో చదివిన అభ్యర్ధులకు పోటీ పరీక్షలలో ప్రోత్సాహక మార్కులు,ఉద్యోగాలలో రిజర్వేషన్లు ఇవ్వాలని ఇన్నాళ్ళూ కోరుతూ ఉన్నాము. తెలుగు మాధ్యమం లో ఇకమీదట చదువే ఉండకపోతే ఈ కోర్కెలు కోరేదెవరు,తీర్చేదెవరు?ప్రస్తుతం కోరేవాళ్ళు చాలా తక్కువ కాబట్టే తీర్చే అవసరం రాక పాలకుల పని సుళువయ్యింది.
నూర్ బాషా రహంతుల్లా
విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్ 6301493266

3, అక్టోబర్ 2019, గురువారం

తెలుగుకు దిక్కు ఎవరు ?



తెలుగుకు దిక్కు ఎవరు ?
హోం మంత్రి షా ప్రవచించిన ఒకే దేశం, ఒకే భాష అనేది శుష్క నినాదం.మనది అనేక రాష్ట్రాలు భాషలు కలిసి బ్రతుకుతున్న దేశం.ఒక దేశంగా ఉంటాం గానీ అందరూ ఒకేభాష మాట్లాడాలి అని శాసిస్తే ఎదురు తిరుగుతాం. హిందీ భాషను దేశమంతా నేర్చుకోవాలనే ప్రకటనను అన్నీ రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. మతం కన్నా భాషనే ప్రజల్ని ఐక్యం చేస్తుంది. భాష విషయంలో రాష్ట్రాలకే అధికారం ఉండాలి. రాష్ట్రాలు కూడా ఆంగ్లం మోజులో పడి స్థానిక భాషల్ని పట్టించుకోకపోతే, రాష్ట్రాల స్థాయిలో కూడా భాషా సమస్యలు తలెత్తి, ఉద్యమ రూపం దాల్చవచ్చు. భాష ఓ సాంస్కృతిక వారధి.భాషను ధ్వంసం చేస్తే ఆ జాతి అంతమై వచ్చే కొత్త తరం పరాయీకరణకు గురవుతుంది.వలస పాలకుల కాలంలోనే మద్రాస్‌ ప్రెసిడెన్సీ కింద దాదాపు 125 పాఠశాలల్లో హిందీని బలవంతంగా ప్రవేశపెట్టారు.పెరియార్‌ నాయకత్వంలో తీవ్రంగా వ్యతిరేకించడంతో దీనిని రద్దు చేసుకున్నారు.1960లో డిఎంకె పార్టీ, హిందీ వ్యతిరేకోద్యమాన్ని నడిపి అధికారాన్ని చేపట్టింది. . కొఠారి,కస్తూరి రంగన్‌ ప్రస్తావించిన త్రిభాషా సూత్రాన్ని ముందుగా నిరసించింది తమిళనాడే!జాతీయ రహదారుల వెంట మైలురాళ్ళ మీద హిందీలో రాసిన ఊళ్ళ పేర్లను తుడిపేయటం తమిళనాడు వెళ్ళినవాళ్ళు చూసేవుంటారు.వాళ్ళు Longlive Classical Divine Tamil అని బోర్డులు పెడతారు. ప్రాచీన దేవభాష తమిళం కలకాలం వర్ధిల్లాలి అని కోరుకుంటారు.అందుకే తమిళం జోలికి వెళితే అసలు ఊరుకోరు.ఆభాషను కాపాడుకోటానికి సదా ప్రయత్నిస్తూనే ఉంటారు.తమిళ ఉద్యమం జల్లికట్టు ఉద్యమం కంటే పదిరెట్లు ఉంటుందని కమల్ హాసన్ హెచ్చరించారు  కూడా.
 ప్రజలు మాట్లాడే భాష వివక్షతకు గురైతే దేశాలే విడిపోతాయని బంగ్లాదేశ్‌ ఏర్పాటు తెలిపింది. భారతదేశ విభజన వలన ఏర్పడిన తూర్పు, పశ్చిమ పాకిస్తాన్‌లలో కూడా ఉర్దూనే అధికార భాషగా ఉంటుందని 1948లో ఇస్లామాబాద్‌ ప్రకటించింది. 1952లో చెలరేగిన భాషాపరమైన అల్లర్లపై పాకిస్తాన్‌ ప్రభుత్వం ఫిబ్రవరి 21, 1952న కాల్పులు జరిపించింది. ఢాకా హైకోర్టు ముందే బంగ్లా  విద్యార్థులు, పౌరులు మరణించారు. చివరికి ప్రభుత్వం 1956లో బంగ్లాను జాతీయ భాషగా గుర్తించింది. 1971లో మొత్తంగా తూర్పు పాకిస్తాన్‌, పశ్చిమ పాక్‌ నుంచి విముక్తి పొంది భాష పేరుతో బంగ్లాదేశ్‌గా  ఏర్పడింది ! భాష రక్షణ కోసం జరిగిన ప్రాణ త్యాగాలకు గుర్తుగా యునెస్కో 1999 ఫిబ్రవరి 21ని అంతర్జాతీయ మాతృభాషా పరిరక్షణ దినోత్స వంగా గుర్తించింది.
మధురై హైకోర్టు న్యాయమూర్తి రమేశ్ గారు న్యాయ పరీక్షలను తమిళ మాధ్యమం లో రాసిన సెంథిల్ కుమార్ అనే విద్యార్ధిని అభినందించారు.అక్కడ సివిల్ జడ్జి పోస్టుల వరకు కూడా తమిళ మాధ్యమంలో చదివి తమిళ మాధ్యమం లోనే పోటీ పరీక్షలు రాసిన అభ్యర్ధులకు 20% ఉద్యోగాలు రిజర్వు చేశారు.తమిళనాడు ప్రభుత్వం జీవో ఎం ఎస్ నంబర్ 145 P & AR (S) డిపార్ట్ మెంట్ తేదీ. 30.09.2010 ద్వారా తమిళ మీడియం లో డిగ్రీ వరకు చదివిన అభ్యర్దులకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో 20 శాతం రిజర్వేషన్ ఇస్తున్నారు.చెన్నై హైకోర్టు కూడా రిట్ పిటీషన్ నంబర్లు 695 and 7403 of 2011 Dt.3.2.2012 , 23.2.2016 ,మళ్ళీ 28.9.2019 న ఈ చట్టాన్ని సమర్ధించింది.తమిళ మాధ్యమంలో చదివిన అభ్యర్దులకు 20% ఉద్యోగాలు రిజర్వు చేయడంలో ఎలాంటి తప్పూ లేదని తేల్చేసింది.రాజ్యాంగంలోని 345 ఆర్టికిల్ ప్రకారం ఎవరి భాషను వాళ్ళు కాపాడుకోవాలని,ఆయా రాష్ట్రాలలో పాలనాభాషగా అధికారభాషగా అభివృద్ధి చేసుకోవాలని కూడా తెలియ జేసింది.
ఈ తీర్పుల్ని ఉదహరిస్తూ మన రాష్ట్రంలో కూడా తెలుగు మాధ్యమ అభ్యర్ధులకు 1985 వరకు ఇచ్చిన 5% ప్రోత్సాహక మార్కులను ఆ తరువాత వివిధ సందర్భాలలో ఇస్తామని ప్రకటించిన 20% రిజర్వేషన్లను ఇప్పించవలసిందిగా హైకోర్టును కోరాలి. ఈ మధ్య జరిగిన గ్రా
వాలంటీర్లు,గ్రామ సచివాలయాల అధికారుల ఎంపిక పరీక్షలలోనైనా తెలుగు మాధ్యమంలో చదివిన అభ్యర్ధులకు 5% ప్రోత్సాహక మార్కులు ,20% శాతం రిజర్వేషన్ ఇస్తే తెలుగు మాధ్యమాన్ని ప్రభుత్వం ప్రోత్సహించినట్లవుతుంది.పైగా ఇవి గ్రామస్థాయి ఉద్యోగాలే కాబట్టి తెలుగులో ఆలోచించి రాయటం ఖచ్చితంగా రావాలి.ప్రజాజీవితంలో తమిళం అవసరమైన అన్నీ ఉద్యోగాలనూ తమిళం చదివిన అభ్యర్ధులను మాత్రమే ఎంపిక చేసేలా తమిళ పాలకులు నిర్ణయాలు తీసుకుంటున్నారు.తెలుగునాట రెండు రాష్ట్రాలలో తమిళనాడు తరహా పనులు జరగాలి.రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రాధమిక విద్యను  ఇంగ్లీషు కాన్వెంట్లలోకి  ప్రభుత్వాలు మార్చాయి.తెలుగుమాధ్యమ కళాశాలలను, తెలుగు మాధ్యమ పట్టభద్రులను వెతికి పట్టుకోవలసి వస్తుంది.ప్రభుత్వ అధినేతలే తెలుగుకు వ్యతిరేకంగా మాట్లాడుతుంటే సామాన్య ప్రజలు అదే సరైన బాట అనుకొని సాగిపోతారు.విచిత్రంగా ఆంధ్ర,తెలంగాణాలలో తెలుగుభాషకు ప్రభుత్వం ఏమిచేస్తుందో పాలకులు చెప్పటంలేదు. తెలుగుకోసం న్యాయస్థానాలకు వెళ్ళి ఓడిపోయిన వాళ్ళ పక్షాన అప్పీలు కూడాచేయటం లేదు.ఇచ్చిన జీవోలు అమలు కాకపోయినా పట్టించుకోవటం లేదు. ప్రాధమిక విద్యను తెలుగు మాధ్యమంలో లేకుండా నిర్మూలించి తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలే  తెలుగును పాలనాభాష కాకుండా మొదటి దెబ్బ కొట్టాయి. ప్రాధమిక విద్య తెలుగుమాధ్యమంలో లేకపోతే  తెలుగును పాలనా భాషగాఅమలు చెయ్యటం అసాధ్యమే.పునాది లేకుండా భవనాన్ని కట్టలేము.    
తెలుగుపత్రికా యజమానులు కొందరైనా ముందుకు రావాలి.కొన్నేళ్ళు పోతే తెలుగు పత్రికలు చదివేవాళ్ళు లేక మూతపడవచ్చు.భాష రక్షణ కేవలం భాషాభిమానుల వల్ల కాకపోవచ్చు.తెలుగు ప్రాధికార సంస్థ కోసం ఇచ్చిన జీవోను అమలు చెయ్యమని అడగాలి.ఒక్కొక్క డిమాండును అమలు చెయ్యమని విడివిడిగా ధరఖాస్తులతో ప్రభుత్వాన్ని కోరాలి. తెలుగు పత్రికాధిపతులు , విశ్వవిద్యాలయాల్లోని తెలుగు శాఖాధిపతులు,తెలుగు ఉపాధ్యాయులు,అధ్యాపకులు ముందుకు రండి.మనం కోరుతున్న కోర్కెలు ఇవే: ప్రాధమిక విద్య తెలుగుమాధ్యమంలోకి మారాలి.తెలుగు ప్రాధికార సంస్థ ఏర్పడాలి.తెలుగులో పాలన జరగాలి.తెలుగు మాధ్యమంలో చదివిన అభ్యర్ధులకు పోటీ పరీక్షలలో ప్రోత్సాహక మార్కులు,ఉద్యోగాలలో రిజర్వేషన్లు ఇవ్వాలి.

---నూర్ బాషా రహంతుల్లా
విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్ ,6301493266

31, ఆగస్టు 2019, శనివారం

పాలనాభాషగా తెలుగు అమలుకు పది సూచనలు


పాలనాభాషగా తెలుగు అమలుకు పది సూచనలు
ప్రపంచ తెలుగు రచయితల సంఘం 4వ మహాసభల సందర్భంగా వెలువరించబోతున్న “ప్రపంచ తెలుగు” గ్రంధంలో ప్రచురించటానికి “పాలనా భాషగా తెలుగు” అనే అంశంపై నన్ను ఒక వ్యాసం రాసిపంపమని కోరారు. తెలుగు పాలనాభాషగా మన ప్రభుత్వ కార్యాలయాల్లో  తెలుగు అమలుకోసం ఒక తెలుగు వాడిగా , ఒక ప్రభుత్వ అధికారిగా  1974 నుండి వివిధ పత్రికలలో వ్యాసాలు రాస్తూనే ఉన్నాను.పత్రికలలో ప్రచురితమైన వ్యాసాలను సంకలనపరచి  1.తెలుగు అధికారభాష కావాలంటే?(2004,2006), 2. తెలుగు దేవభాషే (2012), 3. తెలుగులో పాలన (2018) అనే మూడు పుస్తకాలను తెచ్చాను. ఆ పుస్తకాలలో తెలుగును , ప్రభుత్వ కార్యాలయాలలో ఎలా అమలు చెయ్యాలో, పాలనా భాషగా తెలుగు అమలులో ఎదురయ్యే సమస్యలు పరిష్కారాలు మళ్ళీ మళ్ళీ స్వానుభవంతో చెబుతూనే ఉంటాను.
ఆంగ్ల కాన్వెంట్ల ఉద్యమం
కొన్నేళ్ళక్రితం మొదలైన ఆంగ్ల కాన్వెంట్ల ఉద్యమం రాష్ట్రమంతా పాకి ప్రభుత్వాలకు సోకి 2019 కల్లా  తెలుగులో  ప్రాధమికవిద్యలేకుండా పోయింది.  ఇప్పుడు బడుల్లో తెలుగు నేర్పే వాళ్ళూ లేరు.నేర్చే వాళ్ళూ లేరు.కేవలం పద్యాలు,శతకాలు మాత్రమే చదివిన వాళ్ళు, తెలుగులో మిగతా శాస్త్రాలేమీ చదువని వాళ్ళు, ఉద్యోగులైతే కార్యాలయాల్లో తెలుగులో ఫైళ్ళు నడపగలరా?ప్రాధమిక విద్యను తెలుగు మాధ్యమంలో లేకుండా నిర్మూలించి తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలే  తెలుగును పాలనాభాష కాకుండా మొదటి దెబ్బ కొట్టాయి. ప్రాధమిక విద్య తెలుగుమాధ్యమంలో లేకపోతే  తెలుగును పాలనా భాషగాఅమలు చెయ్యటం అసాధ్యమే.పునాది లేకుండా భవనాన్ని కట్టలేము. 
 భాషల ప్రాతిపదికపై ఏర్పడిన మొదటి రాష్ట్రం అంధ్రప్రదేశ్. తమిళభాష ఆధిపత్యాన్ని వదిలించుకొని మన తెలుగు భాషలో మనల్ని మనమే పరిపాలించు కుందామనే సదాశయంతో ఆనాడు ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రజల భాషలో పరిపాలన జరగాలనే కోరిక అతి సహజమైనది.ఇప్పుడు మాతృభాషకు దూరమైన తెలుగు ప్రజలు మమ్మల్ని ఇంగ్లీషులోనే పాలించండి అని రివర్స్ లో కోరుకునే స్థాయికి వచ్చారు.బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి ఒకకేసులో క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్న న్యాయవాదిని నేను తమిళుణ్ణి,నన్ను హిందీలో ప్రశ్నలు అడగవద్దు,ఇంగ్లీషులోనే అడగండి,ఎందుకంటే కోర్టు అధికారభాషకూడా ఇంగ్లీషే అన్నాడు. అలా నేను తెలుగువాడిని అనిచెప్పగలిగే  నాయకుడు మనకు కూడా కావాలి.ఎన్టీఆర్ తరువాత తెలుగును అంతగా ప్రేమించిన నాయకుడు మనకు రాలేదు.ఆయన తెలుగులో రాస్తేనే ఫైళ్ళపై సంతకాలు పెట్టేవాడట.నశించిపోయిన హెబ్రూ భాషను ఇశ్రాయిల్ దేశస్తులు అనేక కష్టాలు పడి పునరుద్ధరించుకొని పాలనలోకి తెచ్చుకున్నారని మన తెలుగు నాయకులే భాషా దినోత్సవాలలో చెబుతూ ఉంటారు. తెలుగు హెబ్రూ అంతగా నాశనమై పోలేదు.ఇంకా జనంలో బ్రతికేఉంది కాబట్టి ప్రభుత్వం ఇప్పటి వరకు వచ్చిన జీవోలను అమలు చేస్తే చాలు అని భాషాభిమానులు కోరుతున్నారు.
అమలుకాని శాసనాలు
జిల్లా స్థాయి కోర్టుల్లో దిగువ స్థాయి న్యాయస్థానాల్లో వాదప్రతివాదాలు తెలుగులో జరగాలి.తీర్పులన్నీ తెలుగులోనే ఇవ్వాలి అనేదే 1974 లో వచ్చిన మొదటి జీవో (ప్రభుత్వ ఉత్తర్వు (హోంశాఖ) సంఖ్య 485 తేదీ.29.3.1974).
ఆతరువాత తెలుగులో పాలన సాగించటం కోసం 1988 నుండి 2018  వరకు 6  ముఖ్యమైన ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చాయి. వాటి ప్రకారం ఆంధ్ర ప్రదేశ్ లోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో అధికార భాషగా తెలుగును ఖచ్చితంగా అమలు చెయ్యాలి.జీవోలిచ్చారు గానీ ఆ ఉత్తర్వులు ఎన్నడూ సరిగా అమలుకాలేదు.అవేమిటో చూద్దాం:
1. ఆంగ్లంలో వచ్చిన ఏ ఉత్తరం పైనా ,ప్రతిపాదనపైనా ఎలాంటి చర్య తీసుకోకుండా తిప్పి పంపే అధికారం ప్రతి గజిటెడ్ అధికారికీ ఉంది.తమకంటే పై అధికారుల కార్యాలయాలనుండి వచ్చినా సరే ఆంగ్లంలో వచ్చిన లేఖలను తిప్పి పంపవచ్చు.ఈ విధంగా చేయడం వల్ల జరిగే కష్ట నష్టాలకు,జాప్యానికీ వాటిని ఆంగ్లంలో పంపిన అధికారులదీ ,కార్యాలయాలదే బాధ్యత. (ప్రభుత్వ ఉత్తర్వు (సాధారణ పరిపాలన అ.భా శాఖ) సంఖ్య 167తేదీ.19.3.1988)
2. 1988 నవంబరు 1 వ తేదీ నుండి రాష్ట్రంలో ప్రభుత్వ ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ తెలుగులోనే జరగాలి.అన్ని ప్రభుత్వ ఉత్తర్వుల జారీకి తెలుగు భాషనే ఉపయోగించాలి.ఆంగ్లం వాడకూడదు.కేంద్ర ప్రభుత్వం,ఇతర రాష్ట్రాలు,రాష్ట్రం వెలుపల ఉన్న చిరునామాదారులతో మాత్రమే ఆంగ్లం ఉపయోగించాలి.(ప్రభుత్వ ఉత్తర్వు (సాధారణపరిపాలనఅ.భాశాఖ)సంఖ్య587తేదీ.28.10.1988)
3. అన్ని రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు ,రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలో ఉన్న అన్ని సంస్థలు,అన్ని స్థానిక సంస్థలు తెలుగులోనే ఉత్తర ప్రత్యుత్తరాలు జరపాలి.అన్ని శాసనేతర అవసరాలకు ప్రజలతో జరిపే ఉత్తర ప్రత్యుత్తరాలకూ తెలుగు భాషనే ఉపయోగించాలి. (. ప్రభుత్వ ఉత్తర్వు (సాధారణ పరిపాలన అ.భా శాఖ) సంఖ్య218తేదీ.22.31990)
4. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే ఉత్తర్వులు,నియమాలు,నిబంధనలు,ఉపవిధులు అన్నీ కూడా తెలుగు భాష లోనే ఉండాలి. (ప్రభుత్వ ఉత్తర్వు( సాధారణ పరిపాలన అ.భా శాఖ) సంఖ్య 420 తేదీ .13.9.2005 )
5.రాష్ట్రంలోని అన్ని దుకాణాలు ,సముదాయాల బోర్డులు ప్రభుత్వ పధకాల ప్రారంబోత్సవ నామఫలకాలు,శంకుస్థాపన శిలాఫలకాలు తెలుగులోనే రాయించాలి.( ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 11 (యువజన & సాంస్కృతిక అధికార భాష శాఖ) తేదీ.14.9.2016

6. తెలుగు ప్రాధికార సంస్థను ఏర్పాటు చేస్తూ దానికుండే  అధికారాలు అది విధించే జరిమానాలు నియమాలు వివరంగా చెప్పారు ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 40 (యువజనాభ్యుదయ భాషా సాంస్కృతిక శాఖ)  తేదీ 10.7.2018.
ప్రాధమిక విద్య తెలుగులో
హెబ్రూ భాష గురించి ఇజ్రాయేలీయుల లాగా   పట్టుదలతో పై ఉత్తర్వులన్నీ ఖచ్చితంగా అమలుచేస్తే పరిపాలన పూర్తిగా తెలుగులోనే జరుగుతుంది.జరిగి తీరాలి.పాలకుల్లో మాతృభాష రక్షణపై పట్టుదల ఉండాలి. అవసరమైతే నిరంకుశత్వం చూపాలి.ప్రాధమిక విద్యే తెలుగులోలేకపోతే  పాలనా భాషగా తెలుగు ఎలా మారుతుంది?  
తెలుగువాడిగా పుట్టటం ఎన్నోజన్మల పుణ్యఫలం అనీ,అది రాయల కాలంనాటి రాజభాష అనీ గొప్పలు చెప్పుకోవటమే గానీ క్రమంగా తెలుగు భాష పాలనకు దూరమై కవులకూ కవిత్వాలకు మాత్రమే పరిమితమై పోయింది.తెలుగులో చదువుకొనే పిల్లలు తగ్గిపోయారు.తెలుగు బడులు మన కళ్ళముందే ఇంగ్లీష్ కాన్వెంట్లు గా మారిపోయాయి.తెలుగులో చదివితే ఉద్యోగాలు రావు అనే అభిప్రాయానికి ప్రజలు వచ్చేలా చేసారు.ప్రాధమిక పాఠశాలలు కూడా ఇంగ్లీషువే కావాలని పట్టుబడుతున్నారు.ఎందుకంటే తెలుగు మాత్రమే చదివితే ఉద్యోగాలు రాని పరిస్థితి ఉంది.తెలుగు భాష ద్వారా కూడా ఉద్యోగాలూ,డబ్బు వస్తుంటే అప్పుడు కొందరైనా స్వార్ధం కొంత చంపుకొని తెలుగు చదువుతారు.తెలుగు భాషను బయటి వాడు ఎలాగూ ఆదరించడు ఇంట్లోని వాడూ ఆదరించటం లేదు.ఇలాంటి పరిస్థితుల్లో తెలుగులో పరిపాలన కోరుతున్న మనల్ని కొందరు విచిత్రంగా చూస్తారు.ప్రజల భాష పాలనా భాష గా మారకపోతే ఆ భాష చచ్చిపోతుంది.తెలుగు భాషను ఇళ్ళల్లో మాట్లాడుకోవటానికి పరిమితం చేసి ఆఫీసుల్లో మాత్రం ఆంగ్లానికి పట్టం కడుతున్నారు.తెలుగు ప్రజలు ఇంట్లో తెలుగు మాట్లాడుకున్నా , ఆఫీసులో ఇంగ్లీషు, కోర్టులో ఇంగ్లీషు, కొన్ని ప్రాంతాల్లో హిందీ లేదా ఉర్దూ మాట్టాడాల్సి వస్తుంది. చివరికి దేవుడి ప్రార్ధన చేసుకుందామన్నా సంస్కృతంలోనో అరబ్బీలోనో చేసుకోవాల్సి వస్తోంది. తెలుగు మనిషి మనసుతో పనిలేని ఓ యంత్రం లాగా మారాడు. అలా కాకుండా ఆఫీసుల్లో కూడా తెలుగు  రాజ్యమేలాలి అంటే తెలుగు భాష నేర్పాలి,తెలుగు నేర్చిన వారిని మాత్రమే అధికారులుగా రానివ్వాలి.పాలకులకు ఆచరణలో కొన్ని భాషాపర మైన అవసరాలు,సమస్యలు పదేపదే ఎదురౌతాయి.అందువలన మన భాషలో పరిపాలన బాగా జరగటానికి ఇంకా ఏమేమి సమస్యలు ఎదురౌతాయో వాటిని అధిగమించి ఎలా పనులు చెయ్యాలో చూద్దాం:

1.      న్యాయపాలన తెలుగులో
పూర్వం రాజులు చక్రవర్తులు తమ తమ మాతృ భాషలలో ప్రజలతో సంభాషించేవారు. అలాగే ధైనందిన జీవిత వ్యవహారాల పరిష్కారాల విషయంలో కూడా మాతృభాషని ఉపయోగించటం వలన ప్రజలకు రాజ్యపాలన దగ్గరైంది. ప్రజల భాషలోనే రాజ్యపాలన సాగింది. ఎవరైనా బాధితుడు వచ్చి ధర్మగంటను మ్రోగిస్తే, రాజు విచ్చేసి బాధితుడి మొర విని నిందితుడ్ని పిలిపించి అందరి సమక్షంలో విచారించేవాడు. అ విచారణలో ఇరు పక్షాల వాదోపవాదాలు మాతృ భాషలో జరిగేవి. తీర్పరి అయిన రాజుగారికి ఫిర్యాది-నిందితుడికీ మధ్య మధ్యవర్తిగా ఏ' ప్లీడరు' వుండేవాడు కాదు.
రాజు విచారణ జరిపేటపుడు ప్రజల భాషలోనే ప్రశ్నించి వివాద మర్మాన్ని పసిగట్టేవాడు. చివరకు ప్రజల భాషలోనే తీర్పు ప్రకటించే వాడు. ఈ మేరకు ఆటు విచారణ ఇటు తీర్పు ప్రజల సొంత భాషల్లో జరగటంతో మధ్యవర్తుల ఆవసరమే వుండేది కాదు. తీర్పు సొంతభాషలో రావడంతో ఫిర్యాదికిగానీ, నిందితుడికిగాని అర్ధంకానిదంటూ ఏవిూ వుండేది కాదు. ప్రస్తుత న్యాయపరిపాలన విధానంతో అనాటి పద్థతులను పోల్చి చూసుకుంటే ఎంతో క్షోభ కల్గుతుంది. కక్షిదారుల భాషలోనే హైకోర్టు తీర్పులుకూడా రావాలని రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ కోరారు.ప్రజలకు న్యాయం జరగడం ఒక్కటే ముఖ్యంకాదు.తనకు జరిగిన న్యాయాన్ని తనసొంతభాషలో చదువుకోవాలనే రాష్ట్రపతి అభిప్రాయం మేరకు సుప్రీం కోర్టు తీర్పుల్ని కూడా ప్రాంతీయ భాషల్లోకి మార్చి వెబ్ సైట్ లో పెట్టారు.  
2.అన్నిదరఖాస్తులు తెలుగులో
పాలకొల్లు మండలంలో ఎమ్మార్వోగా ఉండగా దరఖాస్తు ఫారాలు నింపడానికి ఆఫీసు బయట ఒక ప్రైవేటువ్యక్తి పనిచేస్తూ ఉండేవాడు. వచ్చిన వ్యక్తుల అవసరాలనుబట్టి ఇంతింత ఈ ఫారం నింపడానికివ్వాలని వసూళ్ళు చేస్తున్నాడని ఫిర్యాదులు వచ్చాయి. ఆ ఫారాలు ఇంగ్లీషులో ఉండేవి. ఏయే పనులకోసం ఈ ఆఫీసుకు ప్రజలు వస్తున్నారు, ఏమేమి ఫారాలు వాళ్ళు పూరించి ఆఫీసులో ఇవ్వాలో తెలుసుకున్నాను. ఓపికగా ఆయా దరఖాస్తులు తెలుగులోకి అనువదించాను. నాలుగైదు తరగతులు చదివిన వారెవరైనా పూర్తిచేయటానికి వీలుగా అన్నిరకాల దరఖాస్తుఫారాలు తయారయ్యాయి. వాటిని ఆ ఊళ్ళోని జిరాక్సు షాపులన్నిటికీ ఇచ్చి కేవలం అర్ధరూపాయికే ఏ ఫారమైనా అమ్మాలని చెప్పాము. ఎవరికివారే ఫారాలు నింపుకొని వస్తున్నారు. ప్రతిఫారమూ నాలుగైదు దశలు దాటివచ్చే పద్ధతి తీసేశాం. గ్రామ పాలనాధికారి, రెవిన్యూ ఇన్స్‌పెక్టర్ సంతకాలు చేస్తే చాలు. వాటిపైన నేను సంతకం చేసేవాడిని. ఆఫీస్‌లో గుమాస్తాల ప్రమేయం తగ్గింది. పత్రాల జారీవేగంపెరిగింది.
3.తెలుగులో ధృవీకరణపత్రాలు
నేను హై స్కూల్ చదువుకు రోజూ 7 కి.మీ. కంకటపాలెం నుండి బాపట్ల నడిచి వచ్చే వాడిని. కుల, ఆదాయ ధృవీకరణ పత్రాల కోసం తహసీల్ దార్ ఆఫీస్‌కు వారం రోజులపాటు తిరిగేవాడిని. ప్రతిరోజూ డఫేదారు దగ్గర ఒకటే సమాధానం- దొరగారు క్యాంపు కెళ్ళారు, రేపురండి. ఆనాడు అనుకున్నాను నేను గనక తాసీల్దారునైతే చిన్నపిల్లలకు చకచకా సంతకాలు చేసి పంపిస్తాను. తహసీల్దారునయ్యాక మాట నిలుపుకున్నాను.
స్కూళ్ళు తెరిచే జూన్ మాసంలో సర్టిఫికెట్ల కోసం పిల్లలు బారులు తీరేవాళ్ళు. రద్దీ ఎక్కువగా ఉండేది. మండలంలోని అన్ని హైస్కూళ్ళ ప్రధానోపాధ్యాయులకూ ఒక ప్రొఫార్మా ఇచ్చి, వారి స్కూల్లోని పిల్లలందరి కులం, స్వస్థలం, పుట్టిన తేదీ- మొదలెన వివరాలు నింపి ధ్రువీకరించమని కోరాను. ఆయా గ్రామ పాలనాధికారులు కూడా ఆ వివరాలను ధ్రువీకరించారు. పిల్లలెవరూ మండల కార్యాలయానికి రానక్కరలేకుండా ।శాశ్వత కుల, నివాస స్థల, పుట్టిన తేదీ ధ్రువపత్రాన్ని' వారి ఫొటోలు అంటించి, వారి వారి పాఠశాలల్లోనే పంపిణీ చేశాం. పట్టాదారు పాసు పుస్తకాలు రైతుల ఇళ్లకు పంపిణీ చేయించాం. వీటన్నిటిని తెలుగు రాతపనిలో, మంచి చేతిరాతకలిగిన గ్రామసేవకులు, ఉపాధ్యాయులు, గ్రామ పాలనాధికారులు, విద్యార్థుల్ని కూడా ఉపయోగించుకున్నాం. ఏ ఊరి ప్రజల పని ఆ ఊళ్లోనే ఆ ఊరివాళ్లే చేసుకున్నందువలన ఎంతో స్పష్టంగా పనిజరిగింది.

 4.తెలుగు అనువాదాలు బాగుపడాలి
2008 లో పులిచింతల ప్రాజెక్ట్ లో భూసేకరణ సమ్మతి అవార్డు తెలుగులో ఇచ్చాను.అంతకు ముందు ఎలాంటి మాదిరీ లేని పరిస్థితుల్లో కొత్తగా అనువాదానికి స్వయంగా పూనుకొని రాసిన ఆ అవార్డు రాష్ట్రంలో మొదటి తెలుగు అవార్డు అయ్యింది. --- అధికారులారా! ఇలా మీరెందుకు రాయలేరు?! (జనవరి, 2009, పాలనాభాష (సమాచారనేత్రం). కాబట్టి ఎవరో ఒకరు పూనుకొని కొత్త పత్రాలను తయారు చేయాలి.అవే కాలక్రమేణా మెరుగు పడుతూ వాడుక భాషలోకి మారుతూ అందరికీ మార్గదర్శకమౌతాయి.
ప్రస్తుతం ఇంగ్లీషు నుండి తెలుగులోకి ,తెలుగు నుండి ఇంగ్లీషు లోకి కంప్యూటర్ పై జరిగే అనువాదాలు సవాలక్ష లోపాలతో ఉన్నాయి.తెలుగువారు సాంకేతికంగా ఎంత ఎదిగినా నేటివరకూ అనువాద యంత్రాల తయారీలో బాగా వెనుకబడే ఉన్నారు.కారణం తెలుగు చదువు నాశనమై పోవడమే.కాబట్టి అనువాదాలను తప్పుల్లేకుండా చేసి ఇచ్చే సాఫ్ట్ వేర్ల తయారీదార్లపై తెలుగు ప్రజలు,నాయకులు దృష్టి సారించాలి. తెలుగులోకి తర్జుమాలో తప్పులు రాకుండా మెరుగు పరిచే వారికి ఆర్ధిక సహాయం చెయ్యాలి.అనువాద ఉపకరణాలు లెక్కకు మిక్కిలిగా రావాలి. ఆన్‌లైన్‌లోనూ ఆఫ్‌లైన్‌లోనూ వాటిని విరివిగా లెక్సికన్లు వాడుకునే సౌలభ్యాలు కలగాలి.యంత్రానువాదాలకూ, లిప్యంతరీకరణకూ, విషయాలకు ఆకారాది సూచికలను తయారు చేయటానికీ, వెతకటానికి అనుకూలంగా తెలుగులో కంప్యూటర్‌ వాడకం పెరగాలి.తెలుగు నుండి ఇంగ్లీషు తదితర భాషల్లోకి అలాగే ఇంగ్లీషు నుండి తెలుగులోకి తర్జుమా చేసే ఉపకరణాలు ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందలేదు.అనువాదంలో చోటుచేసుకుంటున్న లోపాలను తప్పుల్నీ సరిదిద్దటానికి తెలుగు సాంకేతిక నిపుణులు అందరూ పూనుకోవాలి.ఈ అనువాద సామాగ్రి ఎంత నాణ్యంగా అభివృద్ధి చెందితే తెలుగులో పాలన అంత నాణ్యత గా ఉంటుంది.ఫైళ్ళ కదలికలో వేగం పెరుగుతుంది. ఏ ఏటికాయేడు విడుదలైన అనువాద ఉపకరణాలలో నాణ్యమైన వాటికి బహుమతులివ్వాలి.

5. నిఘంటువులలో వాడుక భాష
తెలుగు జాతీయలూ, నుడికారాలూ, పదబంధాలూకూర్చిన నిఘంటువుల అవసరంఉంది.ఆన్‌లెన్‌లోనే నిఘంటువులకు కొత్త పదాలను జోడించే అవకాశం అందరికీ ఇవ్వాలి. ఏయే ప్రాంతాల్లో ఏ పదాన్ని ఎందుకు, ఎలా వాడుతుంటారో ఆయా ప్రాంతాల ప్రజలనే చెప్పనివ్వాలి. సరిగాఉన్నట్లు భావించిన కొత్త పదాలను ఎప్పటికప్పుడు నిఘంటువుల్లో చేరుస్తూ పోవాలి. మన నిఘంటువుల సైజు పెరగాలి. అవి జన బాహుళ్యానికి వాడకంలోకి విస్తారంగా వస్తూనే ఉండాలి. వాడుక భాషలో నానా భాషలూ కలగాపులగంగా ఉంటాయి.అయితే అవన్నీ ప్రజలకు బాగా అర్ధమౌతాయి.పరభాషా పదాలనే కారణంతో ఇప్పుడు తెలుగు వాడకంలోంచి సంస్కృతం, ఇంగ్లీషు, ఉర్దూ పదాలను తీసివేయకూడదు.వాడుక తెలుగు భాషలోనే ఆఫీసుల్లో ఫైళ్ళు నడిపితే అదే పదివేలు.మన శాసన సభలో ఎమ్మెల్యేలు ఈ మూడు భాషల పదాలు కలగలిపి మనోరంజకంగా మాట్లాడుతున్నారు. అదే నేటి తెలుగు, వాడుక తెలుగు.వాళ్ళు ప్రజాప్రతినిధులు. వాళ్ళు మాట్లాడుతున్నది మన ప్రజల భాష.

అనువాదకులు తేటతెలుగుకు బదులు సంస్కృతం వాడి భయపెడుతున్నారు. కాలగమనంలో కొత్త కొత్త ఆంగ్లపదాలే మనకు అబ్బు తున్నాయిగానీ, కొత్త తెలుగు పదాలుగానీ, పాతవేగాని కొత్తగా వాడకంలోకి రావడంలేదు.పైగా పిల్లల చదువంతా ఇంగ్లీషు మీడియంలో ఉంది.వేలాది ఆంగ్ల పదాలు మన తెలుగు ప్రజల నాలుకలపై నాట్యమాడుతూ, మన పదాలే అన్నంతగా స్థిరపడిపోయాయి. ఈ పదాలను విడిచిపెట్టి మనం తెలుగులో సంభాషణ చేయలేము. చేసినా ప్రజలకు అర్ధంగాదు. ఉర్ధూ, సంస్కృత,ఆంగ్ల పదాలెన్నింటినో తెలుగు తనలో కలుపుకుంది. అలాగే తెలుగు ప్రజల వాడుకలో బాగా బలపడిన, ఇక ఎవరూ పెకలించలేనంతగా పాతుకుపోయిన, ఇంగ్లీషు పదాలను మన తెలుగు డిక్షనరీలో చేర్చటం వల్ల మన భాష తప్పక బలపడుతుంది.వాడుక పదాల సంపద భాషకు జీవమిస్తుంది. అవి పరభాషపదాలు కూడా కావచ్చు. మనం తెలుగును సరిగా నేర్చుకోక ముందే మనకు ఇంగ్లీషు నేర్పారు. వందలాది ఏళ్ళు మనం ఇంగ్లీషును గత్యంతరం లేక హద్దు విూరి వాడినందు వల్ల, అది మన భాషాపదాలను కబళించి తానే తెలుగై మనలో కూర్చుంది. మన ఆత్మలను వశం చేసుకుంది. ఇక ఇప్పుడు ఈ ఇంగ్లీషు పదాలను నిర్మూలించడం మన తరం కాదు. వాటిని మన పదాలుగా అంగీకరించడమే మంచిది. ఏఏటికాయేడు మన నిఘంటువుకి పదసంపద సమకూర్చాలి . ఎన్ని ఎక్కువ తెలుగు నిఘంటువులు నెట్‌లో చేరితే తెలుగు అంతగా బలపడుతుంది.ఆధునిక అవసరాలకు ధీటుగా తెలుగు భాష తయారు కావాలి. ఇంగ్లీషులో ఉన్న సౌలభ్యాలన్నీ తెలుగుకూ కల్పించాలి.
6.అక్షర రూపాలు లిపిసమస్యలు  
రెండవ ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా2.11.2012 న శ్రీకృష్ణదేవరాయ, పెద్దన, తిమ్మన, తెనాలిరామకృష్ణ, సూరన్న, రామరాజ, మల్లన్న, ధూర్జటి, రామభద్ర, గిడుగు, గురజాడ, సురవరం, యన్.టి.ఆర్., మండలి, నాట్స్, పొన్నాల, రవిప్రకాష్, లక్కిరెడ్డి అనే18 అక్షరరూపాలను విడుదలచేశారు.
అలాగే మే 25, 2019 న మనబడి స్నాతకోత్సవ సందర్భంగా పొట్టి శ్రీరాములు ,శ్యామల రమణ ఖతులను విడుదల చేశారు. ఈ ఖతులన్నీ సిలికానాంధ్ర http://fonts.siliconandhra.org/ వెబ్ సైట్ లో ఉచితంగా దొరుకుతున్నాయి. కానీ ఇప్పటికే అనూ, సూరి లాంటి యూనీ కోడేతర ఫాంట్లలో ముద్రితమై ఉన్న విస్తారమైన తెలుగు సాహిత్యాన్ని తెలుగు యూనీకోడు లోకి మార్చే మార్పిడి సాధనాలు కావాలి. తర్జుమాలో తప్పులు వస్తున్నాయి. అనువాద ఉపకరణాలు, నిఘంటువులు, లెక్కకు మిక్కిలిగా రావాలి. ఆన్‌లైన్‌లోనూ ఆఫ్‌లైన్‌లోనూ వాటిని విరివిగా లెక్సికన్లు వాడుకునే సౌలభ్యాలు కలగాలి. వాటిని తయారు చేసే సాంకేతిక నిపుణులకు నిధులు ఇవ్వాలి. ప్రతి యేటా తెలుగు వైతాళికుల పేరు మీద ప్రోత్సాహక బహుమతులు ఇవ్వాలి.
7. లిపి సంస్కరణ - రోమన్ లిపి
ముత్యాలలాంటి తెలుగక్షరాలంటూ లిపిమీద లేనిపోని సెంటిమెంట్లు పెట్టుకోవడం మాని రోమన్ లిపిలో(a,aa,i,ee ఈ విధంగా) తెలుగును నేర్పితే అప్పుడు మన దేశం ఆధునిక యుగం లోనికి ప్రవేశిస్తుందని తన నిశ్ఛితాభిప్రాయమని 1976 లోనే మొదటి ప్రపంచ తెలుగు మహా సభల సందర్భంగా అన్నారు మహాకవి శ్రీ శ్రీ .( ప్రజాతంత్ర (18.4.1976) "అనంతం" పేజీ196).
వత్తులు ,గుణింతాల ఇబ్బందిని అధిగమించలేకనే చాలామంది బాగా తెలుగు వచ్చిన వాళ్ళు కూడా తెలుగు టైపింగ్ జోలికి రాలేకపోతున్నారు.లిపి సంస్కరణ కూడా అవసరమే. వత్తులూ గుణింతాల బెడద లేకుండా ఒకే వరసలో సాగిపోయేలా రోమన్ లిపిని యంత్రానికి తగ్గరీతిలో ఆంగ్లేయులు ఎంతగానో అభివృద్ధి పరిచారు,అరబిక్ అంకెలను,భారతదేశపు సున్నాను అరువు తెచ్చుకొని మరీ ఆంగ్ల లిపిని విశ్వవ్యాప్తం చేశారు.ఆంగ్ల భాషనూ, అంకెల్ని మనం ఎలాగూ వాడుతూనే ఉన్నాం. ఇక అక్షరాలను కూడా వాడుకుంటే అధికార భాషగా రోమన్‌ తెలుగును పిల్లలకు నేర్పటం, అమలు చేయటం ఎంతో సుళువవుతుంది. లిపిసమస్య సాకుతో అధికారభాష అమలును ప్రక్కన పెట్టటం కంటే అంతర్జాతీయంగా అమలవుతున్న లిపినే మన భాషకు వాడుకుంటే మేలు జరుగుతుంది.చరిత్రలో తెలుగు లిపి ఎన్నో సార్లు మారింది.దేశమంతటికీ ఉమ్మడి లిపిగా ఆంగ్లాక్షరాలను ఉపయోగించుకోవాలి.ప్రపంచం మొత్తం చదవగలిగే స్థాయికి ఎదిగిన ఆంగ్ల లిపిని వాడుకోవటం ద్వారా మన దేశ భాషలన్నింటికీ జవసత్వాలు సమకూరుతాయి.పైగా అన్నిభాషల వాళ్ళూ సెల్ ఫోనుల్లో ఆంగ్ల లిపి ద్వారానే మెసేజీలు ఇప్పటికే పంపుకుంటున్నారు.ప్రపంచ దేశాలలో ఆంగ్ల లిపిలోని సంస్కృత శ్లోకాలను చదువు కుంటున్నారు.దేశ వాసులందరినీ రోమన్ లిపి ద్వారా త్వరగా అక్షరాస్యుల్ని చేయవచ్చు.దేశ మంతటా ఒకే లిపి ఉండటం వలన అందరూ అన్ని భాషలనూ అర్ధం చేసుకోలేకపోయినా కనీసం అన్ని భాషలనూ చదవగలుగుతారు,కార్యాలయాలనుండి వచ్చే ఉత్తర్వులను చదవటం చదివించుకొనటం సులువౌతుంది.లిపి ద్వారా ఐక్యత వస్తుంది.అందువలన తెలుగులో పాలన వ్యవహారాలు సులువుగా జరగాలంటే వేటూరి ప్రభాకర శాస్త్రి గారు ఆనాడు కోరినట్లు లిపి సంస్కరణన్నా జరగాలి లేదా శ్రీ శ్రీ గారి సలహా మేరకు రోమన్ లిపిలో అయినా కార్యాలయ వ్యవహారాలు నడపాలి.

8. తెలుగు మాధ్యమంలో చదువులు
ప్రాధమికవిద్యకే తెలుగులో దిక్కులేనప్పుడు పై చదువులు కూడా తెలుగులో కావాలని ప్రజలు ఏ ధైర్యంతో అడుగుతారు? ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో కూడా అన్ని స్థాయిల్లో 5వ తరగతి వరకు తెలుగు మీడియం ఉండాలి. రాజ్యాంగంతో సహా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చట్టాలను వాడుక భాషలోకి తేవాలి. ఎనిమిదో షెడ్యూల్‌లో పేర్కొన్న భాషలన్నిటినీ అప్పటికప్పుడు తర్జుమాచేసే విధంగా పార్లమెంటులో ఏర్పాటుచేయాలి. అధికార భాషను అమలు చెయ్యని అధికారులపై చర్యలు తీసుకునే అధికారం అధికార భాషా సంఘానికి ఇవ్వాలి. తెలుగు భాషా రక్షణ అభివృద్ధికి మంత్రిత్వ శాఖ కూడా ఏర్పాటు చేయాలి. తెలుగులో ఉత్తరప్రత్యుత్తరాలు రాయగల ఐ.ఎ.యస్., ఐ.పి.యస్. అధికారుల్ని మాత్రమే ప్రజలతో సంబంధమున్న కీలక స్థానాల్లో నియమించాలి. తెలుగు విశ్వవిద్యాలయం, అధికార భాషాసంఘం, తెలుగు అకాడమీ, అన్ని విశ్వవిద్యాలయాల్లోని తెలుగు విభాగాలకు  కార్యాలయాల్లో తెలుగు అమలు  కోసం పనులు అప్పగించాలి. ఈ సంస్థలన్నీ ప్రజల నుండి సూచనలు తీసుకోవాలి. పరిపాలక గ్రంథాలు అంటే కోడ్లు, మాన్యువల్‌లు లాంటివన్నీ తెలుగులో ప్రచురించి అన్నికార్యాలయాలకు పంపాలి. సర్వీస్‌కమిషన్ పోటీపరీక్షలు, శాఖాపరమైన పరీక్షలు తెలుగులో నిర్వహించాలి. కూడిక, తీసివేత లాంటి తెలుగు పదాలకు బదులు సంకలనం, వ్యవకలనం లాంటి సంస్కృత పదాలను వాడి తెలుగు మీడియం అంటే పిల్లలు భయపడేలా చేశారు. పిల్లల పుస్తకాలు వాడుక తెలుగుతో చెయ్యాలి.  తెలుగు మీడియంలో  చదివినా  ఉద్యోగం వస్తుందనే వాతావరణం కల్పించాలి.
9. ఉద్యోగాలు, ప్రోత్సాహకాలు  
ఎవరి భాషను వాళ్ళు కాపాడుకోవాలి- అధికారభాషగా అభివృద్ధి చేసుకోవాలి (రాజ్యాంగం 345 ఆర్టికిల్).
కోయంబత్తూరులో జరిగిన ప్రపంచ తమిళ మహాసభల్లో తమిళ మాధ్యమ విద్యార్ధులకు ప్రభుత్వ ఉద్యోగాలు సులభంగా లభించేలా కొన్ని తీర్మానాలు చేశారు. తమిళ మీడియం అభ్యర్దులకు ఉద్యోగాలు దొరకక పొతే ప్రజలు పిల్లల్ని తమిళ మాధ్యమం లో చదివించరనీ ,ఎవరూ చదవని భాష నశిస్తుందనీ ,తమిళం పదికాలాలపాటు బ్రతకాలంటే ఆభాషలో మాత్రమే చదివిన వారికి వెనుక బడిన కులాలవారికి ఇస్తున్నట్లుగా ఉద్యోగాలలో కూడా రిజర్వేషన్లు ఇవ్వాలని తీర్మానం చేశారు .అందుకోసం అత్యవసరంగా ఒక ఆర్డినెన్స్ తెచ్చారు.శాసన సభలో,స్థానిక సంస్థల్లో ,ప్రభుత్వ కార్పోరేషన్లు,కంపెనీలలో తమిళ అభ్యర్దులకు 20 శాతం ఉద్యోగాలుఇవ్వాలనిశాసించారు.
తమిళనాడు ప్రభుత్వం జీవో ఎం ఎస్ నంబర్ 145 P & AR (S) డిపార్ట్ మెంట్ తేదీ. 30.09.2010 ద్వారా తమిళ మీడియం లో డిగ్రీ వరకు చదివిన అభ్యర్దులకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో 20 శాతం రిజర్వేషన్ ఇస్తున్నారు.చెన్నై హైకోర్టు కూడా 23.2.2016 న ఈ చట్టాన్ని సమర్ధించింది. ప్రభుత్వోద్యాగాలలో  నియామకాలకు తమిళ మాధ్యమంలో చదివిన అభ్యర్దులకు 20% ఉద్యోగాలు రిజర్వు చేయడంలో ఎలాంటి తప్పూ లేదని తేల్చేసింది.రాజ్యాంగంలోని 345 ఆర్టికిల్ ప్రకారం ఎవరి భాషను వాళ్ళు కాపాడుకోవాలని,ఆయా రాష్ట్రాలలో పాలనాభాషగా అధికారభాషగా అభివృద్ధి చేసుకోవాలని కూడా తెలియ జేసింది. ఈ తీర్పు వచ్చి ఎన్నో ఏళ్ళు కాలేదు. కాబట్టి తమిళనాడును ఆదర్శంగా తీసుకొని తెలుగు మాధ్యమంలో చదివిన అభ్యర్డులకు  ఉద్యోగాలలో 20% రిజర్వేషన్ ఇవ్వాలి.తెలుగు మీడియం అభ్యర్ధులకు 10 శాతం ఉద్యోగాలు కోటా ఇస్తామని అప్పటి సాంస్కృతిక శాఖ మంత్రి పల్లె రఘునాధరెడ్డి గారు ప్రకటించారు. ఇంటర్ వరకు కూడా తెలుగు మీడియాన్ని తప్పనిసరి చేస్తామన్నారు.(ఆంధ్రజ్యోతి 9.12.2016).ఈ ప్రకటనలు జీవో లుగా రాలేదు. తెలుగుభాషకు ప్రోత్సాహకాలు ఏమీ ప్రకటించకుండానే 2019 తెలుగు భాషా దినోత్సవం జరిగిపోయింది. వాటిలో పాల్గొన్న నాయకులుకూడా తెలుగు భాషను పొగిడి ఉత్సవాలు ముగించారు.

కనీసం గ్రామ సచివాలయాల్లో ఉద్యోగ నియామకాలకు కూడా తెలుగు మాధ్యమం లో చదివిన అభ్యర్డులకు ప్రోత్సాహకాలు ప్రకటిస్తే బాగుండేది.  ఎందుకంటే గ్రామ వాలంటీర్లు గ్రామ సచివాలయ ఉద్యోగులందరూ గ్రామ  ప్రజలతో మమేకమై వారితో ముఖాముఖి తెలుగులో మాట్లాడుతూ వారిమధ్యే నివసిస్తూ వారికి సేవలందించే ఉద్యోగులు. ప్రజలు వారి భాషలో చెప్పే సమస్యలు, పరిష్కారాలు,సూచనలు వినాలి,రాయగలగాలి . ఈ నైపుణ్యాలన్నీ ప్రజల భాష  తెలుగు మాధ్యమంలో చదివిన వారికే ఎక్కువగా ఉంటాయి. తమిళనాడు తరహాలో తెలుగు మాధ్యమ అభ్యర్ధులకు 20 శాతం ఉద్యోగాలు కూడా రిజర్వేషన్ ఇస్తే,అప్పుడు తెలుగులో కార్యాలయ వ్యవహారాలు నడిపే వాళ్ళు ఎక్కువమంది రంగప్రవేశం చేస్తారు. కొంతవరకైనా ఆఫీసుల్లో తెలుగు బ్రతుకుతుంది. తెలుగు విూడియంలో చదివితే ఉద్యోగా లొస్తాయన్న ఆశతో కొంత మందైనా తెలుగులో చదువుతారు. తెలుగులో చదివిన అధికారులు కార్యాలయాల్లో జరిగే పనులన్నిటికీ ''కొత్తపదాలు'' పుట్టిస్తారు. తెలుగు పదకోశాలు అమలవుతాయి. పరిపాలనకు పనికొచ్చే శాస్త్రీయ పాలనా తెలుగు తయారవుతుంది.అధికారభాషగా తెలుగు అమలు కావాలంటే తెలుగు మాధ్యమంలో చదివిన విద్యార్థుల్ని ప్రోత్సహించి అధికారులుగా చేయకతప్పదు.
10. అధికారభాషా సంఘం
చాలాకాలం పాటు ఉందోలేదో తెలియని అధికారభాషా సంఘానికి ఊపిరిపోస్తూ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ గారిని అధ్యక్షుడిగా  నియమించారు. ఆయన ప్రభుత్వ కార్యాలయాల్లో ఉత్తరప్రత్యుత్తరాలు తెలుగులోనే జరగాలని అందుకోసం ఒక సాఫ్ట్ వేర్ ను  కూడా తయారుచేశామని చెప్పారు. ప్రధాని మోడీ హిందీలో మాట్లాడుతుంటే ఇంగ్లీషులోకి అనువాదం వినిపించే సాఫ్ట్ వేర్ ఈమధ్య వాడారట.దానిని పార్లమెంటులో తెలుగు వాళ్ళ కోసంకూడా ఏర్పాటు చేయించాలి. తెలుగుకు ఒక మంత్రిత్వ శాఖను, తెలుగు ప్రాధికారసంస్థ ఏర్పాటు,దానికి పనులు చేసే అధికారులను నియమింపజేసుకోవాలి. అధికార భాషా సంఘం అధికారాలను పెంచాలి. హైకోర్టులో తెలుగులో వాదనలకు అనుమతి అడగాలి. తెలుగును రెండవ జాతీయ భాషగా ప్రకటించమని కోరాలి. తెలుగులోనే  జీవోలు రప్పించాలి.సర్వీస్‌కవిూషన్‌ పోటీ పరీక్షలు,శాఖాపరమైనపరీక్షలు తెలుగులోనిర్వహించాలి.
---- నూర్ బాషా రహంతుల్లా
విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్
అమరావతి 6301493266 , 9948878833

(nrahamthulla@gmail.com)