tag:blogger.com,1999:blog-6982090862782011703.post1650106519841921408..comments2023-08-29T07:38:14.908-07:00Comments on అధికారభాషగా తెలుగు: తెలుగు వారు పలికే ఉర్దూ పదాలుNrahamthullahttp://www.blogger.com/profile/10659324401568824872noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-6982090862782011703.post-73106820443118955882018-11-18T07:59:44.852-08:002018-11-18T07:59:44.852-08:00"ఉర్దూ.. సంస్కృతం భాషలు ఒక మతానికో, ప్రాంతాని... "ఉర్దూ.. సంస్కృతం భాషలు ఒక మతానికో, ప్రాంతానికో పరిమితం కాదు. అవి భారతీయ భాషలు.స్వాతంత్య్ర పోరాటంలో హిందూ ముస్లింలు ఏకమై చేస్తున్న తిరుగుబాటును ఎదుర్కొనే ప్రయత్నంలో భాగంగా బ్రిటిషు వాళ్లు 'విభజించు పాలించు' అనే విధానాన్ని అమలులో పెట్టి ఆయా వర్గాల మధ్య చిచ్చు పెట్టారు.అది నేటికీ రాజుకుంటూనే ఉంది.దేశంలో అనేక భాషలు ఉన్నప్పటికీ కాలక్రమంలో ఉర్దూ, సంస్కృతంల ఉనికికే ప్రమాదం ఏర్పడింది.ఉర్దూ అంటే ముస్లింల భాష అని, సంస్కృతం అంటే హిందువుల భాష అన్న అపోహలు ప్రజల్లో ఉన్నాయి కానీ అది వాస్తవం కాదు. మాది హిందూ కుటుంబమే అయినా ఆ రోజుల్లో మా తాతముత్తాతలు ఉర్దూలోనే చదువుకున్నారు. ఇప్పటికీ మన ప్రధాని మన్మోహన్సింగ్ కూడా తన ప్రసంగాన్ని ఉర్దూలోనే రాసుకుంటారు.మనది వ్యవసాయ ఆధారిత దేశం కావడం, పుష్కలమైన వనరులు ఉండటంతో కరువు పీడిత ప్రాంతాలుగా ఉన్న అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్ వంటి ప్రాంతాల నుంచి అప్పట్లో ఎందరో బతుకుతెరువు కోసం భారత్కు వలస వచ్చారు కానీ తిరిగి వెళ్లలేదు.ఇప్పటికీ అదే పరిస్థితి కొనసాగుతోంది.వారంతా ఉర్దూ భాషను అక్కున చేర్చుకున్నారు."--మార్కండేయ ఖట్జూ ఈనాడు 6.4.2013Nrahamthullahttps://www.blogger.com/profile/10659324401568824872noreply@blogger.comtag:blogger.com,1999:blog-6982090862782011703.post-11211778161697136352018-11-18T07:55:40.273-08:002018-11-18T07:55:40.273-08:00ఉర్దూ ముస్లిముల భాష కాదు (ఆంధ్రజ్యోతి 29.7.2015)
ఉ...ఉర్దూ ముస్లిముల భాష కాదు (ఆంధ్రజ్యోతి 29.7.2015)<br />ఉర్దూ ముస్లిముల మత భాష కాదు.ముస్లిముల సొంత భాష అంతకంటే కాదు. కొంతమంది ముస్లిములు మాత్రమే సొంతం చేసుకొని వాళ్ళ బడాయి కోసం బలవంతాన మతం రంగు పులిమారు.ఇదే అదనుగా అది వాళ్ళ భాషేనని కొందరు ఉర్దూను సాయిబులకే అంటగట్టి చేతులు దులుపుకున్నారు.వాస్తవానికి ఉర్దూ కూడా తెలుగు లాగానే భారతీయ భాష . పైగా సామాన్యుల వాడుక భాష. హిందుస్తానీ (కారి బోలీ ) భాష.ఇది భారతదేశంలో పుట్టిపెరిగి అభివృద్ధి చెందింది. 1947 వరకు మనదేశంలో రాజ భాష ఉర్దూనే.హైదరాబాద్ రాష్ట్ర హైకోర్టులో న్యాయ వ్యవహారాలు ఉర్దూలోనే జరిగేవి. న్యాయవాదులు వాదనలు ఉర్దూలో చేసేవారు. తీర్పులు ఉర్దూలో వచ్చేవి. ఉర్దూలో న్యాయశాస్త్ర పుస్తకాలు ఉండేవి.రెండు హైకోర్టుల విలీనం వల్ల ఉర్దూ బెంచిని ఏడు సంవత్సరాలు నడిపిస్తామని చెప్పి మధ్యలోనే ఆపేశారు.ఉర్దూను కొందరు ముస్లిములు తమ మత భాషగా వేరుచేసి చెలామణి చేసిన ఫలితంగా ఆ భాష పట్ల వ్యతిరేకత పెరిగింది.ఉర్దూ రానివాళ్ళు ముస్లిములే కాదు అని గతంలో కొందరు ఉర్దూ ముస్లిములు తెలుగు ముస్లిముల మీద పెత్తనం చేసేవారు.ముస్లిం అంటే ఉర్దూ మాట్లాడటం,బిరియానీ తినటం అనే వాళ్ళ కాలం పోయింది.క్రమేణా ముస్లిముల మతగ్రంధాలన్నీ తెలుగులోకి దిగి వస్తున్నాయి.ఏ భాషకూ మతం ఉండదు.మతస్తులే ఆయా భాషలను వారి అవసరాల కోసం వాడుకుంటారు.<br />" హైదరాబాదు సంస్థానంలో ఉర్దూ నెత్తిన రుద్దారని అంధ్రోద్యమం నడువగా, ఆంధ్రప్రదేశ్గా ఆవతరణ చెందిన తర్వాత ఉర్దూ బదులు ఇంగ్లీషే పెత్తనం చెయ్యసాగింది. ఎరుగని మిత్రుడు కన్నా ఎరిగిన శత్రువు నయం అన్న సామెతగా ఉర్దూ స్థానంలో ఇంగ్లీషు రావడం సమైక్యానికి సహయపడక పోగా, భాషా రాష్ట్రాల ఆశయమే 20 సంవత్సరాలు అయినా అమలు జరుగదాయె '' అని 1977లో ఆనాటి అధికార భాషా సంఘం అధ్యక్షుడు శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య అన్నారు. ( ' విశాలాంధ్రం ' పేజీలు 77, 78 )<br />ఏ మనిషికైనా మాతృభాషలోని మాధుర్యం మరో భాషలో చిక్కదు. ఇది తెలుగు రాష్ట్రం గనుక ఉర్దూ కంటే మిన్నగా తెలుగును పాలనా భాషగా అధికారికంగా చెప్పి మరీ అమలు చెయ్యవచ్చు.తెలుగు భాషా పీఠాలకు ,విశ్వవిద్యాలయాలకూ నిధులిచ్చి ఎంతైనా అభివృద్ధి చెయ్యవచ్చు.దేశీయ భాషలన్నీ వికసించాలి.ప్రాంతీయ భాషలన్నిటినీ అభివృద్ధి చెయ్యాలి.ప్రాంతీయ భాషల వాళ్ళు భారీగా సివిల్ సర్వీసుల్లోకి అడుగుపెట్టే అవకాశాలు కల్పించాలి.భాషలకు సాంకేతికతను జోడించినప్పుడే ఉపాధి లభిస్తుందని అబ్దుల్ కలాం గారు చెప్పారు.ఉపాదినివ్వని భాషలను ప్రజలూ తిరస్కరిస్తున్నారు.ఈనాడు తెలుగుభాష ద్వారా ఉపాధి లేనట్లే ఉర్దూ ద్వారా కూడా ఉపాధి లేదు.అలాంటి భాషలకు నిధులు ఇచ్చి ప్రాణం పోస్తున్నారు కాబట్టి మన తెలుగుకు ఇంకా ఎక్కువగా నిధులు ఇవ్వాలి.<br />Nrahamthullahttps://www.blogger.com/profile/10659324401568824872noreply@blogger.com