4, జులై 2010, ఆదివారం

తమిళులు ఎలా చేస్తే మనమూ అలా చేద్దాం

కోయంబత్తూరులో జరిగిన ప్రపంచ ప్రాచీన తమిళ మహానాడు ఆమోదించిన తీర్మానాలపై ఆ రాష్ట్ర క్యాబినెట్ తీసుకున్ననిర్ణయాలు ఇవి :
*తమిళానికి కేంద్రంలో అధికార భాషా హోదా కల్పించాలి.ఈ అంశంపై పార్లమెంటులో ఓ తీర్మానాన్ని ప్రతిపాదించి దానిపై చర్చించాలి.

*మద్రాసు హైకోర్టులో తమిళంలో వాదనలకు అనుమతించాలి.దీనిపై ముఖ్యమంత్రి కరుణానిధి కేంద్ర ప్రభుత్వానికి 2006లోనే లేఖ రాశారు.
*తమిళ భాషాభివృద్ధికి పరిశోధనలకు అవసరమైన రాయితీ నిధులను కేంద్రం ఇవ్వాలి.రాష్ట్రం లో శాసన అధ్యయనా కేంద్రం నెలకొల్పాలి.

*తమిళంలో చదువుకున్న అభ్యర్ధులకు ప్రభుత్వ ఉద్యోగావకాశాలు, ప్రాధాన్యత ఇవ్వాలి.

*పాఠశాలలు, కళాశాలల పాఠ్యాంశాల్లో తమిళ ప్రాచీన భాషా శీర్షికను చేర్చాలి.

*తమిళ భాషాభివృద్ధికి రూ.100 కోట్ల నిధులు ఏర్పరచాలి.

*తమిళంలో ఉత్తమ సాఫ్ట్‌వేర్‌ను ఎంపిక చేసి, దాని రూపకర్తకు కన్యన్‌పూంగుండ్రనాథ్ పేరుతో రూ.1 లక్ష నగదు అవార్డు, ప్రశంసపత్రం ప్రతి సంవత్సరం పంపిణీ చేయాలి.

మన రాష్ట్రం కూడా తెలుగు భాష గురించి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలని కోరుతున్నాను.తమిళులు ఎలా చేస్తే మనమూ అలా చేద్దాం.
ఇక నుంచి తమిళనాడులోని అన్ని డిగ్రీ కళాశాలల్లో కూడా ద్వితీయభాషగా తమిళమే వుండబోతోందని ఆ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి కె.పొన్ముడి పేర్కొన్నారు.వచ్చే ఏడాది నుంచి డిగ్రీ ప్రథమ సంవత్సరం నుంచే తమిళ సాహిత్యం, పద్య,గద్య, వ్యాకరణం తదితరాలన్నీ వుంటాయన్నారు. డిగ్రీ ద్వితీయ సంవత్సరంలో తమిళ వ్యాకరణ చరిత్ర, ప్రాచీన తమిళంలు సబ్జెక్టులుగా వుంటాయన్నారు.
ఆర్ట్స్ అండ్ సైన్స్, ఎయిడెడ్ కళాశాలలు, స్వయంప్రతిపత్తి కళాశాలలకు కూడా ఈ విధానాలే వర్తిస్తాయని పొన్ముడి ప్రకటించారు.మనం కూడా ఇలాంటి ప్రకటన ఆశించవచ్చా?

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి